ప్రజలకు చేరువయ్యేందుకు.. చాలా మార్గాలే ఉన్నాయి. వారి కష్టాలు తెలుసుకోవచ్చు. వారి తరఫున గళం వినిపించవచ్చు. ప్రభుత్వంపై పోరాటం చేయొచ్చు. నిరంతరం ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించ డం ద్వారా కూడాప్రజలకు చేరువ కావొచ్చు. కానీ.. వైసీపీ మాస్ పాలిటిక్స్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుల నుంచి జూనియర్ల వరకు కూడా.. మాస్ ఎలివేషన్ కోరుకుంటున్నారు. అయితే.. ఇది వైసీపీకి ఏమేరకు మేలు చేస్తుందన్నది ప్రశ్న.
ప్రజల్లో మాస్ పాలిటిక్స్ను కోరుకునేవారు.. 10 శాతంలోపే ఉంటారు. కొడతాం.. నరుకుతాం.. అంటే.. ఎవరు మాత్రం ముందుకు వస్తారు? ఏదో పెడతాం.. అంటే.. ఓటేస్తారు కానీ.. అనే మాట ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇద్దరు మాజీ మంత్రులు వరుసగా చేసిన కామెంట్లు. వారిద్దరికి తమ తమ నియోజకవర్గాలలో అంతో ఇంతో క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ, జగన్ మాయలో పడుతున్నారో.. లేక వారి పార్టీ విధానమే అంత అనుకుంటున్నారో తెలియదు కానీ… మాస్లో పడికొట్టుకుంటు న్నారు.
మాజీ మంత్రులు.. పేర్ని నాని, ఆదిమూల సురేష్లు ఇద్దరూ కూడా.. వరుస పెట్టి చేసిన వ్యాఖ్యలు వైసీపీని మరింత బద్నాం చేశాయి. రప్పా-రప్పా అని చెప్పడం కాదు.. చేసేయడమే! అని తనదైన శైలిలో పేర్ని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, దీనికి కొనసాగింపా అన్నట్టుగా.. మాజీ మంత్రి, మాజీ ప్రభుత్వ ఉన్నతోద్యోగి కూడా అయిన.. ఆదిమూలపు సురేష్.. కూడా.. ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
“ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి రప్పా రప్పా.. మరో లెక్క!” అంటూ.. ఆదిమూలపు కూడా బరితెగింపు వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇలా.. మాస్ పాలిటిక్స్ చేసుకుంటూ.. పోతే.. రేపు పార్టీని మూసేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అప్పుడు.. వైసీపీలోనే రప్పా రప్పా.. చేసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఉన్న మార్గాలను వదిలేసి.. రప్పా రప్పా.. డైలాగులతో కాలం వెళ్లదీయడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on July 12, 2025 3:51 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…