విద్యా బాలన్.. లెజెండరీ స్టేటస్ తెచ్చుకున్న బాలీవుడ్ కథానాయికగా. ఐతే తన పేరు చూస్తే ఆమె తమిళ అమ్మాయి అని అర్థమైపోతుంది. విద్య ఆహార్యం చూసినా దక్షిణాది లుక్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆమె పుట్టి పెరిగింది ముంబయే కావడంతో అక్కడే సినిమాల్లో ప్రయత్నం చేసింది. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఐతే సౌత్ సినిమాలకు సూటయ్యే కథానాయిక అయినప్పటికీ ఆమె ఇక్కడ పెద్దగా సినిమాలు చేయలేదు.
తెలుగులో నందమూరి బాలకృష్ణతో ‘యన్.టి.ఆర్’, తమిళంలో అజిత్తో ‘నీర్కొండ పార్వై’ లాంటి సినిమాల్లో మాత్రమే కనిపించింది. అది కూడా కెరీర్లో లేటు వయసులో ఆమె ఇక్కడ ఈ చిత్రాలు చేసింది. ఐతే తనకు దక్షిణాది సినిమాల్లో నటించకూడదనేమీ లేదని.. కెరీర్లో ప్రైమ్లో ఉండగానే ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నించానని.. కానీ తాను ఖరారైన సినిమాలన్నింటి నుంచి ఒకేసారి తనను తీసేశారని విద్య తాజాగా వెల్లడించింది.
గతంలో మోహన్ లాల్కు జోడీగా తాను ఒక మలయాళ సినిమాకు సంతకం చేశానని.. కొన్ని రోజులు చిత్రీకరణ కూడా జరిగిందని.. కానీ ఏవో కారణాలతో సినిమా మధ్యలో ఆగిపోయిందని విద్య చెప్పింది. ఐతే ఆ సినిమా ఆగిపోవడానికి తనే కారణం అని, తాను ఐరెన్ లెగ్ అని ప్రచారం చేశారని.. దీని వల్ల తాను అప్పటికే సంతకం చేసిన తొమ్మిది దక్షిణాది చిత్రాల నుంచి తనను తప్పించారని విద్య వెల్లడించింది.
నిజానికి దర్శకుడికి, మోహన్ లాల్కు మధ్య విభేదాలు రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందని.. కానీ ఏ సంబంధం లేని తన మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసి నెగెటివ్ ప్రచారం చేయడంతో సౌత్లో తన కెరీర్ దెబ్బ తిందని విద్య ఆవేదన వ్యక్తం చేసింది. ఐతే మోహన్ లాల్ సినిమాకు సంబంధించి ఏం జరిగిందో కానీ.. మరీ దక్షిణాదిన తొమ్మిది సినిమాలు కమిటైతే, అన్నింటి నుంచి తనను తప్పించారని విద్య చెప్పడం మాత్రం కొంచెం అతిశయోక్తిగానే ఉంది.
This post was last modified on July 10, 2025 1:58 pm
మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…
టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…
వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు,…
వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…