ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా స్కూల్ మాస్టారి అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. దాదాపు 45 నిమిషాలకుపైగా ఆయన 8వ తరగతి విద్యార్థులకు సైన్సుపాఠం బోధించారు. వారిని ప్రశ్నలు అడుగుతూ.. సమాధానాలు రాబడుతూ.. పాఠ్య పుస్తకాన్ని ఫాలో అవుతూ.. విద్యార్థులకు ‘వనరులు’ అనే పాఠాన్ని బోధించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వం పాఠశాలలో నిర్వహించిన ‘మెగా పేరెంట్స్-టీచర్స్’ కార్యక్రమంలో చంద్రబాబు ఇలా స్కూల్ మాస్టర్గా మారిపోయారు.
అక్కడే మధ్యాహ్న భోజనం కూడా చేశారు. అనంతరం.. తల్లిదండ్రులతో కూడా.. పిచ్చాపాటి మాట్లాడారు. విద్యార్థుల స్థాయిని తెలుసుకున్నారు. ఇలా.. మొత్తం కార్యక్రమంలో గంటన్నరకు పైగా సాగింది. సాధారణంగా చంద్రబాబు కార్యక్రమం అంటే.. మీడియా లైవ్ ప్రసారం చేస్తుంది. దీంతో చంద్రబాబు చెప్పిన పాఠాలను కేవలం ఆ స్కూలు విద్యార్థులే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సహా బాబు అభిమానులు కూడా ఆలకించడం విశేషం.
అంతేకాదు.. లైవ్ తర్వాత.. ఈ వీడియోలను యూట్యూబ్లోనూ వీక్షించిన వారు ఉన్నారు. ఎన్నారైలు కూడా.. వీటిని ఆసక్తిగా విన్నారు. చంద్రబాబు గతంలోనూ ఒకటి రెండు సార్లు స్కూళ్లను సందర్శించి.. విద్యార్థులతో మమేకం అయినా.. ఇలా టెక్స్ట్ పుస్తకాన్ని పట్టుకుని ఆయన పాఠాలు చెప్పడం.. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన ఏకబిగిగా నిలబడి.. పిల్లలతో ఇంటరాక్ట్ కావడం వంటివి జరగలేదు. దీంతో తొలిసారి చంద్రబాబు ఇలా పూర్తిస్థాయిలో స్కూల్ టీచర్గా మారిపోవడంతో అందరూ ఆసక్తిగా ఆయనను గమనించారు.
దీంతో లైవ్లోనే కాకుండా.. యూట్యూబ్లోనూ ఆయన పాఠాలను 2 లక్షల మందికిపైగా వినడం ఒక రికార్డనే చెబుతున్నారు.. పార్టీ నాయకులు. ఇలా.. గతంలో ఏ సీఎం చేయకపోవడం.. చంద్రబాబు ఎంతో ఓర్పు, నేర్పలతో విద్యార్థులకు పాఠాలు నేర్పడం వంటివి ఆసక్తిగా మారాయని అంటున్నారు. ఇదీ.. చంద్రబాబు మాస్టారికి గురుపౌర్ణమినాడు దక్కిన అరుదైన గౌరవమనే చెప్పాలి.
This post was last modified on July 11, 2025 10:11 am
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…