Movie News

విజయ్ దేవరకొండ చురకలు ఎవరికో

కింగ్ డమ్ విడుదల జూలై 31 ఫిక్సయిపోయింది. నిన్న కొత్త టీజర్ తో అనౌన్స్ మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అలెర్టయిపోయారు. హరిహర వీరమల్లుకి కేవలం వారం గ్యాప్ తో రిలీజ్ చేయాల్సి వస్తున్నా తప్పని సరి పరిస్థితుల్లో ఇంత కన్నా వేరే ఆప్షన్ లేకపోయింది. ఇప్పటికే మార్చి నుంచి మూడు డేట్లు మార్చుకున్న ఈ పీరియాడిక్ డ్రామా మీద నిర్మాణ సంస్థ సితార భారీగా ఖర్చు పెట్టింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మరో ఆకర్షణగా నిలుస్తోంది. కింగ్ డమ్ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో విజయ్ మినీ బాంబులు పేలుస్తున్నాడు.

ఒక స్క్రిప్ట్ ని తిరస్కరించే స్వతంత్రం తనకు ఒకప్పుడు లేదని, బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి ధైర్యంగా ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పలేకపోవడం ఒక రకంగా మైనస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. బలమైన నేపథ్యం ఉన్న ఫ్యామిలి, తండ్రి ఉంటే ఒకటికి రెండుసార్లు దాన్ని సరి చూసుకుని అవసరమైతే వేరే రచయితలను తీసుకొచ్చి మార్పులు చేయించే స్టార్ తండ్రులున్న హీరోలు తనకు తెలుసని, ఆ అడ్వాంటేజ్ తనకు లేదని అన్నాడు. ఇప్పుడిప్పుడే స్వంతంగా చెప్పగలిగే స్థాయికి వచ్చానని చెబుతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా నో అనేస్తున్నానని వివరించాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ విజయ్ దేవరకొండ నెపోటిజం గురించే ఉదాహరించాడని వేరే చెప్పనక్కర్లేదు. పేరు ప్రస్తావించలేదు కానీ చాలా మందికి అప్లై అవుతుంది. గతంలో లైగర్ ఈవెంట్ లో తనకు తాతలు తండ్రులు లేరని, అయినా ఇంత ప్రేమ చూపించడం ఏమిటని ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మిస్ ఫైర్ అయ్యాయి. తర్వాత మళ్ళీ అలా స్లిప్ కాలేదు. ఇప్పుడు అన్నవి అంత తీవ్రంగా లేకపోయినా సబ్జెక్టు సెలక్షన్ కు, వారసత్వ హీరోలకు ముడిపెట్టిన వైనం గురించి మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా కింగ్ డం మాత్రం తనకు చాలా ప్రతిష్టాత్మకం కానుంది.

This post was last modified on July 8, 2025 11:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago