అక్కినేని నాగార్జున కెరీర్లో చివరి బ్లాక్ బస్టర్ అంటే ‘సోగ్గాడే చిన్నినాయనా’నే. ఇందులో నటించిన మిగతా వాళ్ల కెరీర్లలోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయేదే. నాగ్ సరసన కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠికి కూడా కెరీర్లో ఇదే పెద్ద హిట్. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమాలో ఆమె అయిష్టంగానే చేసిందట. ఈ సినిమాకు తనను అడిగినపుడు చాలామంది నెగెటివ్గానే మాట్లాడినట్లు లావణ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
నాగ్ లాంటి సీనియర్ హీరో సరసన నటిస్తే ఓ ముద్ర పడిపోతుందని.. తర్వాత వరుసగా అలాంటి సినిమాలే వస్తాయని అన్నారట. దీంతో తాను అయిష్టంగానే ఈ సినిమాకు సంతకం చేసినట్లు లావణ్య తెలిపింది. ఇదే విషయాన్ని తాను నాగార్జునకు కూడా చెప్పానని.. ఆయన ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేసి.. తనకెన్నో మంచి విషయాలు చెప్పారని, తన కెరీర్ విషయంలో చక్కటి గైడెన్స్ ఇచ్చారని.. ఇప్పటికీ కెరీర్ విషయంలో ఏమైనా సలహాలు కావాలంటే తాను నాగార్జుననే అడుగుతానని లావణ్య తెలిపింది.
ఇక తన పాత్రల విషయంలో వచ్చిన విమర్శల గురించి లావణ్య మాట్లాడుతూ.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో తన మేకప్ ఏమాత్రం బాగా లేదన్న విమర్శలు చాలా విన్నానని, తనకు కూడా అది నిజమే అనిపించిందని.. దీంతో అప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నానని అంది. ‘అర్జున్ సురవరం’ కంటే ముందు వరుసగా ఫ్లాపులు ఎదుర్కోవడంపై మాట్లాడుతూ.. వాటికి తనదే బాధ్యత అంది. కొన్ని పాత్రలు బాగా లేకున్నా వేరే కారణాల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆమె అంది. ప్రస్తుతం ‘ఎ1 ఎక్స్ప్రెస్ సినిమాలో హాకీ క్రీడాకారిణిగా చాలా మంచి పాత్ర చేస్తున్నానని.. దీంతో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నానని లావణ్య వెల్లడించింది.
This post was last modified on May 1, 2020 1:27 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…