Movie News

సోగ్గాడే చిన్నినాయనా.. అయిష్టంగానే చేసిందట

అక్కినేని నాగార్జున కెరీర్లో చివరి బ్లాక్ బస్టర్ అంటే ‘సోగ్గాడే చిన్నినాయనా’నే. ఇందులో నటించిన మిగతా వాళ్ల కెరీర్లలోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయేదే. నాగ్ సరసన కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠికి కూడా కెరీర్లో ఇదే పెద్ద హిట్. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమాలో ఆమె అయిష్టంగానే చేసిందట. ఈ సినిమాకు తనను అడిగినపుడు చాలామంది నెగెటివ్‌గానే మాట్లాడినట్లు లావణ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

నాగ్ లాంటి సీనియర్ హీరో సరసన నటిస్తే ఓ ముద్ర పడిపోతుందని.. తర్వాత వరుసగా అలాంటి సినిమాలే వస్తాయని అన్నారట. దీంతో తాను అయిష్టంగానే ఈ సినిమాకు సంతకం చేసినట్లు లావణ్య తెలిపింది. ఇదే విషయాన్ని తాను నాగార్జునకు కూడా చెప్పానని.. ఆయన ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేసి.. తనకెన్నో మంచి విషయాలు చెప్పారని, తన కెరీర్ విషయంలో చక్కటి గైడెన్స్ ఇచ్చారని.. ఇప్పటికీ కెరీర్ విషయంలో ఏమైనా సలహాలు కావాలంటే తాను నాగార్జుననే అడుగుతానని లావణ్య తెలిపింది.

ఇక తన పాత్రల విషయంలో వచ్చిన విమర్శల గురించి లావణ్య మాట్లాడుతూ.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో తన మేకప్ ఏమాత్రం బాగా లేదన్న విమర్శలు చాలా విన్నానని, తనకు కూడా అది నిజమే అనిపించిందని.. దీంతో అప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నానని అంది. ‘అర్జున్ సురవరం’ కంటే ముందు వరుసగా ఫ్లాపులు ఎదుర్కోవడంపై మాట్లాడుతూ.. వాటికి తనదే బాధ్యత అంది. కొన్ని పాత్రలు బాగా లేకున్నా వేరే కారణాల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆమె అంది. ప్రస్తుతం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో హాకీ క్రీడాకారిణిగా చాలా మంచి పాత్ర చేస్తున్నానని.. దీంతో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నానని లావణ్య వెల్లడించింది.

suman

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

1 hour ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

2 hours ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

3 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

4 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

4 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

4 hours ago