Movie News

సూర్య హీరోగా 8 వసంతాలు తీస్తే

ఇటీవలే 8 వసంతాలతో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు నరేంద్ర ఫనిశెట్టి కంటెంట్ కన్నా ఎక్కువగా స్పీచులతో హాట్ టాపిక్ అయ్యాడు. తగ్ లైఫ్ గురించి మణిరత్నంని సమర్ధించే ప్రయత్నంలో ఆడియన్స్ మీద చేసిన కామెంట్స్ మిస్ ఫైర్ అయ్యాయి. పది నిముషాలు పెన్ను పక్కన పెడితే నేను సృష్టించే మాస్ విధ్వంసం ఎలా ఉంటుందో వారణాసి ఎపిసోడ్ లో చూడమని ఇంకో ఎలివేషన్ ఇచ్చాడు. తీరా చూస్తే హీరోయిన్ ఫైట్ చేయడం తప్ప మరే ప్రత్యేకత కనిపించలేదు. ఈ బ్లాక్ గురించి ఒక మీడియా ప్రతినిధి అభ్యంతరం వ్యక్తం చేయడం, దాని గురించి సోషల్ మీడియా చర్చ జరగడం ఇదో మినీ రచ్చ అయ్యింది.

సక్సెస్ మీట్ కు రాకుండా మరోసారి క్వశ్చన్ మార్క్ రేపిన నరేంద్ర ఫనిశెట్టి తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కొత్త సంగతులు చెప్పాడు. అందులో షాక్ ఇచ్చేది ఒకటుంది. 8 వసంతాలని తొలుత సూర్య, దీపికా పదుకునే జంటగా తీయాలనుకున్నానని, కానీ మైత్రి మూవీ మేకర్స్ కొత్త వాళ్ళతో అయితేనే ఇలాంటివి బాగుంటాయని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్టుగా చెప్పాడు. వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 8 వసంతాలు సూర్య లాంటి స్టార్ హీరోకు అస్సలు సూటవ్వదు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాగా భవిష్యత్తులో కల్ట్ అని చెప్పుకోవడానికి పనికొస్తుందేమో కానీ థియేటర్ లో జనం ఇలాంటి పాత్రల్లో చూడలేరు.

అలా చూసుకుంటే మైత్రి వాళ్ళు తీసుకున్నది తెలివైన నిర్ణయమని చెప్పాలి. ఎందుకంటే 8 వసంతాలు థియేటర్ కన్నా ఓటిటి, డిజిటల్ డీల్స్ ద్వారా సేఫ్ అయిపోయింది. ఒకవేళ సూర్య లాంటోళ్లను పెట్టుకుంటే బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది. నష్టాలకు రిస్క్ ఉంటుంది. బిజినెస్ పరంగా ఒత్తిడి చవి చూడాల్సి వస్తుంది. ఇవేవి లేకుండా కొత్త వాళ్ళు కాబట్టి సేఫ్ గా బయట పడ్డారు. నిజంగా సూర్య ప్రతిపాదనతో నరేంద్ర ఫనిశెట్టి మాట్లాడుకున్నాడో లేక ఇప్పుడేదో హైప్ కోసం ఇలా అంటున్నాడో చెప్పలేం కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడమే కాదు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన మాట వాస్తవం.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

36 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

9 hours ago