ఇటీవలే 8 వసంతాలతో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు నరేంద్ర ఫనిశెట్టి కంటెంట్ కన్నా ఎక్కువగా స్పీచులతో హాట్ టాపిక్ అయ్యాడు. తగ్ లైఫ్ గురించి మణిరత్నంని సమర్ధించే ప్రయత్నంలో ఆడియన్స్ మీద చేసిన కామెంట్స్ మిస్ ఫైర్ అయ్యాయి. పది నిముషాలు పెన్ను పక్కన పెడితే నేను సృష్టించే మాస్ విధ్వంసం ఎలా ఉంటుందో వారణాసి ఎపిసోడ్ లో చూడమని ఇంకో ఎలివేషన్ ఇచ్చాడు. తీరా చూస్తే హీరోయిన్ ఫైట్ చేయడం తప్ప మరే ప్రత్యేకత కనిపించలేదు. ఈ బ్లాక్ గురించి ఒక మీడియా ప్రతినిధి అభ్యంతరం వ్యక్తం చేయడం, దాని గురించి సోషల్ మీడియా చర్చ జరగడం ఇదో మినీ రచ్చ అయ్యింది.
సక్సెస్ మీట్ కు రాకుండా మరోసారి క్వశ్చన్ మార్క్ రేపిన నరేంద్ర ఫనిశెట్టి తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కొత్త సంగతులు చెప్పాడు. అందులో షాక్ ఇచ్చేది ఒకటుంది. 8 వసంతాలని తొలుత సూర్య, దీపికా పదుకునే జంటగా తీయాలనుకున్నానని, కానీ మైత్రి మూవీ మేకర్స్ కొత్త వాళ్ళతో అయితేనే ఇలాంటివి బాగుంటాయని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్టుగా చెప్పాడు. వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 8 వసంతాలు సూర్య లాంటి స్టార్ హీరోకు అస్సలు సూటవ్వదు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాగా భవిష్యత్తులో కల్ట్ అని చెప్పుకోవడానికి పనికొస్తుందేమో కానీ థియేటర్ లో జనం ఇలాంటి పాత్రల్లో చూడలేరు.
అలా చూసుకుంటే మైత్రి వాళ్ళు తీసుకున్నది తెలివైన నిర్ణయమని చెప్పాలి. ఎందుకంటే 8 వసంతాలు థియేటర్ కన్నా ఓటిటి, డిజిటల్ డీల్స్ ద్వారా సేఫ్ అయిపోయింది. ఒకవేళ సూర్య లాంటోళ్లను పెట్టుకుంటే బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది. నష్టాలకు రిస్క్ ఉంటుంది. బిజినెస్ పరంగా ఒత్తిడి చవి చూడాల్సి వస్తుంది. ఇవేవి లేకుండా కొత్త వాళ్ళు కాబట్టి సేఫ్ గా బయట పడ్డారు. నిజంగా సూర్య ప్రతిపాదనతో నరేంద్ర ఫనిశెట్టి మాట్లాడుకున్నాడో లేక ఇప్పుడేదో హైప్ కోసం ఇలా అంటున్నాడో చెప్పలేం కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడమే కాదు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన మాట వాస్తవం.
This post was last modified on July 3, 2025 11:50 am
అనుకున్నదే జరుగుతోంది. థియేటర్లలో రిలీజైనప్పటి కంటే ఓటీటీలోకి వచ్చాక ‘ది రాజాసాబ్’ మీద ట్రోలింగ్ ఇంకా ఎక్కువ జరుగుతోంది. సినిమా…
ఈ మధ్య కంటెంట్ కన్నా ఎక్కువగా కాంట్రావర్సితో వార్తల్లో నిలిచిన సినిమా బరాబర్ ప్రేమిస్తా. ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్…
ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయిన మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్.. 2021లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాక స్పీడు తగ్గించాడు.…
పదహారు సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు డిజాస్టర్. నిర్మాత నాగబాబుని నిండా ముంచేసిన సినిమా. ఇప్పుడు చూస్తేనేమో కల్ట్ క్లాసిక్. మూడోసారి…
అమరావతిలో కొత్త వెలుగులు సంతరించుకున్నాయి. గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రానికి శనివారం సాయంత్రం భూమి…
తిరుమల శ్రీవారి లడ్డూపై ప్రజల ఆలోచన ఎలా ఉంది? వారు ఏమన్నారు? ముఖ్యంగా వైసీపీ హయాంలో ఎలాంటి అభిప్రాయం ప్రజల…