సితారే జమీన్ పర్ బాక్సాఫీస్ వద్ద స్టడీగా దూసుకుపోతోంది. నిన్న పదమూడో రోజు అందులోనూ వర్కింగ్ డే నాడు 40 వేలకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోవడం మాటలు కాదు. మాములుగా ఇలాంటి నెంబర్ బ్లాక్ బస్టర్లకే కనిపిస్తుంది. కానీ అమీర్ ఖాన్ సినిమా మరీ జవాన్, పఠాన్ రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టడం లేదు. అయినా సరే నింపాదిగా వసూళ్లు రాబడుతూ లాంగ్ రన్ వైపు ఆశలు పెంచుతోంది. ఇప్పటికే డబుల్ సెంచరీ దాటేసిన సితారే జమీన్ పర్ కు మొన్న శుక్రవారం రిలీజైన కాజోల్ మా మిశ్రమ స్పందన తెచ్చుకోవడం కలిసి వస్తోంది. సీరియస్ హారర్ తో రూపొందిన ఆ చిత్రం సోసోగా ఆడుతోంది.
బాలీవుడ్ విశ్లేషకులు ఈ విజయానికి దారి తీసిన కారణాలు విశ్లేషిస్తున్నారు. ఏ ఓటిటికి అమ్మనని అమీర్ ఖాన్ ముందే తెగేసి చెప్పడం వాటిలో మొదటిది. నెట్ ఫ్లిక్స్ లాంటి బడా సంస్థలు వంద కోట్లకు పైగా ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పడం ప్లస్ అయ్యిందట. పైగా రెండు మూడు నెలల తర్వాత యూట్యూబ్ లో పే పర్ వ్యూ మోడల్ లో స్ట్రీమింగ్ చేసే ఆలోచన ఉన్నట్టు బయటికి రావడం ఇంకో కారణం. అక్కడ కట్టే డబ్బులేవో ఇప్పుడే టికెట్లు కొని థియేటర్లో చూస్తే పోలాని ఆడియన్స్ అనుకోవడం వల్లే అమ్మకాలు బాగున్నాయని అంటున్నారు. పైరసీ వెర్షన్ వచ్చినా దాని ప్రభావం తక్కువగా ఉండటం గమనార్హం.
మరో ముఖ్యమైన విషయం అమీర్ ఖాన్ మీదున్న సింపతీ. ఎంత కష్టపడుతున్నా విజయం దక్కడం లేదనే సానుభూతితో ఉన్న మూవీ లవర్స్ కు డీసెంట్ గా ఉన్న సితారే జమీన్ పర్ కంటెంట్ గొప్పగా కనిపించింది. అందులోనూ ప్రమోషన్ల పరంగా అమీర్ ఖాన్ మాములుగా కష్టపడలేదు. ఒక యూట్యూబ్ ఛానల్ కు నాన్ స్టాప్ గా 5 గంటలకు పైగా సాగే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం స్టార్ హీరోల హిస్టరీలో ఇదే మొదటిసారి. ఇవన్నీ కూడబలుక్కుని సితారే జమీన్ పర్ కు పట్టం కట్టాయనేది వాటి సారాంశం. ఇంత రెస్పాన్స్ చూశాక అమీర్ ఖాన్ డిజిటల్ రిలీజ్ మరింత ఆలస్యం చేస్తాడని వేరే చెప్పనక్కర్లేదు.
This post was last modified on July 3, 2025 11:07 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…