Movie News

కుడివైపు వీరమల్లు – ఎడమవైపు రామాయణ

రేపు టాలీవుడ్ కు బిగ్ డే అని చెప్పాలి. ఒకే రోజు, ఇంచుమించు ఒకే సమయంలో రెండు క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ కి సంబంధించిన ఈవెంట్స్ జరగనున్నాయి. హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం అభిమణులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. మిత్రులు ఆనంద్ సాయి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చూసి ఆనందం వ్యక్తం చేసిన వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతోంది. రేపు ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో ట్రైలర్ లాంచ్ ని అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయబోతున్నారు. విజువల్స్ గురించి ప్రీ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది.

ఇంత హంగామా ఉంది కాబట్టి సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం హరిహర వీరమల్లు మీదే ఉంటుందని తొలుత భావించినా ఇప్పుడో ట్విస్టు వచ్చి పడింది. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన రామాయణ మొదటి గ్లిమ్ప్స్ ని రేపు హైదరాబాద్  ప్రసాద్ మల్టీప్లెక్సులో పెద్ద ఎత్తున లాంచ్ చేస్తున్నారు. ఆదిపురుష్ తో సహా రామాయణ గాథ కొన్ని వందలసార్లు తెరకెక్కినప్పటికీ ఇప్పుడు చూడబోయేది మాత్రం విజువల్ వండర్ లా ఉంటుందని టీమ్ హామీ ఇస్తోంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. రీచ్ చాలా భారీగా ఉండబోతోంది.

రేపు ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ ఫ్యాన్స్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు. రామాయణ ఇంకో రోజు రిలీజ్ చేయాల్సిందని, ఇప్పుడు జనాల అటెన్షన్ ని పంచుకోవాల్సి వస్తోందని ఫీలవుతున్నారు. దేనికవే బడ్జెట్ పరంగా వందల కోట్లతో తీసిన సినిమాలు. వీరమల్లు ఈ జూలై 24 విడుదల కాబోతుండగా రామాయణ వచ్చే సంవత్సరం దీపావళికి లాక్ చేసుకుంది. ఇంత ముందుగా ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారంటే బిజినెస్ కోసమట. చిన్న సాంపిల్ తోనే బయ్యర్లు ఎగబడే రేంజ్ లో వీడియో కట్ ఉందని ముంబై టాక్. అదెంత వరకు నిజమో రేపు ఈ సమయానికి తేలిపోతుంది. చూద్దాం.

This post was last modified on July 2, 2025 1:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago