రేపు టాలీవుడ్ కు బిగ్ డే అని చెప్పాలి. ఒకే రోజు, ఇంచుమించు ఒకే సమయంలో రెండు క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ కి సంబంధించిన ఈవెంట్స్ జరగనున్నాయి. హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం అభిమణులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. మిత్రులు ఆనంద్ సాయి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చూసి ఆనందం వ్యక్తం చేసిన వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతోంది. రేపు ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో ట్రైలర్ లాంచ్ ని అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయబోతున్నారు. విజువల్స్ గురించి ప్రీ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది.
ఇంత హంగామా ఉంది కాబట్టి సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం హరిహర వీరమల్లు మీదే ఉంటుందని తొలుత భావించినా ఇప్పుడో ట్విస్టు వచ్చి పడింది. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన రామాయణ మొదటి గ్లిమ్ప్స్ ని రేపు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో పెద్ద ఎత్తున లాంచ్ చేస్తున్నారు. ఆదిపురుష్ తో సహా రామాయణ గాథ కొన్ని వందలసార్లు తెరకెక్కినప్పటికీ ఇప్పుడు చూడబోయేది మాత్రం విజువల్ వండర్ లా ఉంటుందని టీమ్ హామీ ఇస్తోంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. రీచ్ చాలా భారీగా ఉండబోతోంది.
రేపు ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ ఫ్యాన్స్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు. రామాయణ ఇంకో రోజు రిలీజ్ చేయాల్సిందని, ఇప్పుడు జనాల అటెన్షన్ ని పంచుకోవాల్సి వస్తోందని ఫీలవుతున్నారు. దేనికవే బడ్జెట్ పరంగా వందల కోట్లతో తీసిన సినిమాలు. వీరమల్లు ఈ జూలై 24 విడుదల కాబోతుండగా రామాయణ వచ్చే సంవత్సరం దీపావళికి లాక్ చేసుకుంది. ఇంత ముందుగా ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారంటే బిజినెస్ కోసమట. చిన్న సాంపిల్ తోనే బయ్యర్లు ఎగబడే రేంజ్ లో వీడియో కట్ ఉందని ముంబై టాక్. అదెంత వరకు నిజమో రేపు ఈ సమయానికి తేలిపోతుంది. చూద్దాం.
This post was last modified on July 2, 2025 1:41 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…