పుష్ప 2 ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించాక అట్లీతో చేస్తున్న అల్లు అర్జున్ తర్వాతి లైనప్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కు వెళ్లిపోవడంతో నెక్స్ట్ ఎవరితోననే సందేహం అభిమానుల్లో ఉంది. అప్పుడెప్పుడో ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టు మీద సైతం అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీతో రావణం అనే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి నేరుగా కాకపోయాయినా చూచాయగా చెప్పడం, ఖండించకపోవడం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది
అయితే నిర్మాణానికి చాలా టైం పట్టొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ముందు జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తి చేయాలి. అంటే 2026 సమ్మర్ దాకా ఖాళీ అవ్వడు. ఆ తర్వాత రావణం పనులు మొదలుపెట్టాలి. ఎంతలేదన్నా సంవత్సరం పైగానే పడుతుంది. 2027లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ కొట్టిపారేయలేం. దిల్ రాజు పలు సందర్భాల్లో ప్రశాంత్ నీల్ కొలాబరేషన్ గురించి చెబుతున్నారు కానీ హీరో ఎవరనేది బయట పెట్టలేదు. ఇప్పుడూ చెప్పలేదు కానీ కొట్టి పారేయలేదు. ఆర్యతో కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాతగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎవడులో బన్నీ క్యామియో చేయడానికి రామ్ చరణ్ తో పాటు దిల్ రాజు కూడా కారణమే.
జానర్ గట్రా తర్వాత సంగతులు కానీ మైథలజి టచ్ ఉంటుందని అంతర్గత సమాచారం. గత కొంత కాలంగా గేమ్ ఛేంజర్ తప్ప పెద్ద సినిమాల జోలికి వెళ్లని దిల్ రాజు ఇకపై స్పీడ్ పెంచబోతున్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ తో మొదలుపెట్టి తన నుంచి భారీ చిత్రాలను ఆశించవచ్చని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అట్లీతో చేస్తున్న సినిమా ఫైనల్ కాపీ సిద్ధమవ్వడానికి ఎంతలేదన్నా ఏడాదిన్నర పట్టేలా ఉంది. 2027 సంక్రాంతి విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నారట. అదైన వెంటనే ప్రశాంత్ నీల్ తో చేతులు కలుపుతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.
This post was last modified on July 2, 2025 2:55 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…