Movie News

క్రేజీ కాంబో : అల్లు అర్జున్ రావణం ?

పుష్ప 2 ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించాక అట్లీతో చేస్తున్న అల్లు అర్జున్ తర్వాతి లైనప్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కు వెళ్లిపోవడంతో నెక్స్ట్ ఎవరితోననే సందేహం అభిమానుల్లో ఉంది. అప్పుడెప్పుడో ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టు మీద సైతం అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీతో రావణం అనే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి నేరుగా కాకపోయాయినా చూచాయగా చెప్పడం, ఖండించకపోవడం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది

అయితే నిర్మాణానికి చాలా టైం పట్టొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ముందు జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తి చేయాలి. అంటే 2026 సమ్మర్ దాకా ఖాళీ అవ్వడు. ఆ తర్వాత రావణం పనులు మొదలుపెట్టాలి. ఎంతలేదన్నా సంవత్సరం పైగానే పడుతుంది. 2027లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ కొట్టిపారేయలేం. దిల్ రాజు పలు సందర్భాల్లో ప్రశాంత్ నీల్ కొలాబరేషన్ గురించి చెబుతున్నారు కానీ హీరో ఎవరనేది బయట పెట్టలేదు. ఇప్పుడూ చెప్పలేదు కానీ కొట్టి పారేయలేదు. ఆర్యతో కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాతగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎవడులో బన్నీ క్యామియో చేయడానికి రామ్ చరణ్ తో పాటు దిల్ రాజు కూడా కారణమే.

జానర్ గట్రా తర్వాత సంగతులు కానీ మైథలజి టచ్ ఉంటుందని అంతర్గత సమాచారం. గత కొంత కాలంగా గేమ్ ఛేంజర్ తప్ప పెద్ద సినిమాల జోలికి వెళ్లని దిల్ రాజు ఇకపై స్పీడ్ పెంచబోతున్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ తో మొదలుపెట్టి తన నుంచి భారీ చిత్రాలను ఆశించవచ్చని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అట్లీతో చేస్తున్న సినిమా ఫైనల్ కాపీ సిద్ధమవ్వడానికి ఎంతలేదన్నా ఏడాదిన్నర పట్టేలా ఉంది. 2027 సంక్రాంతి విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నారట. అదైన వెంటనే ప్రశాంత్ నీల్ తో చేతులు కలుపుతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

This post was last modified on July 2, 2025 2:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘సంభవం’… క్రేజీ ఐడియా ఇది

గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి…

2 hours ago

ప్రమోషన్లు బాగున్నాయి… జనాలు రావడమే తరువాయి

రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో…

3 hours ago

మోడీ-షా… మాములోళ్ళు కాదండోయ్

అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…

5 hours ago

చంద్రబాబు అంటే ఆ మాత్రం ఉండదా?

పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్…

6 hours ago

‘మామిడి’ మోసం… ఇదిగో హెచ్చరిక

వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…

7 hours ago

బిల్లు బీజేపీది అయితే వైసీపీ మద్దతు ఉండదా

బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…

8 hours ago