ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎంత పెద్ద హీరోల పక్కన నటించే ఛాన్స్ దొరికినా కథ నచ్చితే తప్ప ఒప్పుకోని ధోరణి సాయిపల్లవిది. తన పెర్ఫార్మన్స్ కి స్కోప్ లేకపోతే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ లో అడిగితే తిరస్కరించింది ఈ కారణంగానే. తండేల్ ఓకే చెప్పింది కూడా తన క్యారెక్టర్ ప్రాధాన్యం గుర్తించడం వల్లే. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ సాయిపల్లవికి అతి త్వరలో పెద్ద సవాల్ ఎదురు కానుంది. బాలీవుడ్ డెబ్యూ రన్బీర్ కపూర్ తో చేస్తున్న రామాయణం అయ్యుంటే బాగుండేది కానీ దానికన్నా ముందు రాబోతున్న సినిమా ఒకటి అగ్ని పరీక్ష కానుంది.
అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సరస సాయిపల్లవి నటించిన భారీ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏక్ దిన్ టైటిల్ ని లాక్ చేయొచ్చని ముంబై మీడియా టాక్. షూటింగ్ చాలా కాలం నుంచి జరుగుతోంది. ఇప్పటికి కొలిక్కి వచ్చిందట. సమస్య ఏంటంటే జునైద్ ఖాన్ మీద జనంలో బాగా నెగటివ్ అభిప్రాయం ఉంది. ఓటిటి తెరంగేట్రం మహారాజతో పాటు ఆ మధ్య వచ్చిన బిగ్ స్క్రీన్ మూవీ లవ్ యాపా దారుణంగా ఫెయిలయ్యింది. సినిమాలు పోతే పోయాయి కానీ కనీసం నటనకు ప్రశంసలు వచ్చి ఉంటే బాగుండేది. అదీ జరగలేదు. తండ్రిలో కనీసం పావొంతు పెర్ఫార్మన్స్ ఇవ్వడం లేదని క్రిటిక్స్ తలంటుతున్నారు.
అలాంటి జునైద్ ఖాన్ సరసన సాయిపల్లవి నటిస్తోంది. సబ్జెక్టు సెలక్షన్ పట్ల అంత కఠినంగా ఉండే ఈ ఫిదా భాగమతిని ఎగ్జైట్ చేసిన విషయాలు ఏక్ దిన్ లో ఏమున్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. నిజానికి ఈ వేసవిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ సాధ్యపడలేదు. ఇప్పుడీ కంటెంట్ ని ఫుల్ చేయాల్సిన బాధ్యత సాయిపల్లవి మీదే ఉంది. జునైద్ ఖాన్ కోసం వచ్చే అభిమానులు పెద్దగా కనిపించడం లేదు. సినిమా ఎక్స్ ట్రాడినరిగా ఉంటే తప్ప ఆడియన్స్ ని కదిలించడం కష్టం. మరి బాలీవుడ్ తొలి అడుగే ఐఎఎస్ ఎగ్జామ్ లా మారిన ఏక్ దిన్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
This post was last modified on June 25, 2025 11:46 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…