లాక్ డౌన్ హీరో సోనూ సూద్ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఒక పెద్ద న్యూస్ రేపు చెప్పబోతున్నా అంటూ బుధవారం ఒక పుస్తకం మీద ఆనుకుని ఉన్న ఫొటోతో ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టిన సోనూ.. ఆ న్యూస్ ఏంటో ఈ రోజు వెల్లడించాడు. తాను ఆత్మకథ రాయబోతున్నట్లు ప్రకటించాడు. ఫొటోలో పుస్తకం కనిపించడంతో తాను చేపట్టి ఎడ్యుకేషనల్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తాడేమో అని అంతా అనుకున్నారు కానీ.. ఇలా ఆత్మకథ అంటాడని ఎవరూ అనుకోలేదు. ఈ ప్రకటన సోనూ అభిమానుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉంటూ వివిధ భాషల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసిన సోనూ, ఆ పాత్రలతో వచ్చిన పేరు కంటే.. కరోనా టైంలో అనితర సాధ్యమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎక్కువ పేరు సంపాదించాడు. అతణ్ని జనాలు రియల్ హీరో అంటున్నారు.
ఆత్మకథలో కూడా ఒక భాగం సినీ రంగ ప్రయాణం నేపథ్యంలో ఉంటే.. ఇంకో భాగం కరోనా-లాక్ డౌన్ టైంలో తాను చేపట్టిన సేవా కార్యక్రమాలు, అవి ఇచ్చిన సంతృప్తి, తన వర్తమాన-భవిష్యత్ ప్రణాళికల గురించే సోనూ వివరించే అవకాశముంది. వేల కోట్ల సంపద ఉన్న వాళ్లే కరోనా టైంలో నామమాత్రంగా విరాళాలు ప్రకటించి ఊరుకుంటే.. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేస్తే.. సోనూ మాత్రం గొప్ప మనసుతో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంతో మొదలుపెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికీ వందల మందిని ఆదుకుంటున్నాడు.
భవిష్యత్తులో లక్షల మందికి ఉపయోగపడేలా ఉపకార వేతనాలు, ఉద్యోగ అవకాశాలు అందింేచ ప్రణాళికలతో ముందుకెళ్తున్నాడు. వీటన్నింటి గురించి సోనూ తన ఆత్మకథలో ప్రస్తావించబోతున్నట్లే. ఆ పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో.
This post was last modified on November 12, 2020 9:04 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…