ఒకపక్క థియేటర్, ఓటిటికి మధ్య గ్యాప్ తగ్గిపోవడం వల్ల జనాలు సినిమా హాళ్లకు రావడం లేదని బయ్యర్లు మొత్తుకుంటూనే ఉన్నారు. పెద్దతెరపై చూసే అనుభూతికి ఏదీ సాటిరాకపోయినా కరోనా టైం నుంచి మారిపోయిన అలవాట్ల వల్ల ప్రేక్షకుల మైండ్ సెట్ కొత్తగా ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఆడియన్స్ ని మెప్పించడం పెద్ద సవాల్ గా మారిపోయింది. స్మార్ట్ స్క్రీన్లలో చూడొద్దని ముందు బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ పొందండని హీరోలు దర్శక నిర్మాతలు క్రమం తప్పకుండా చెబుతూనే ఉంటారు. కానీ దానికి భిన్నంగా 8 వసంతాలు సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది.
థియేటర్ కంటే త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాక 8 వసంతాలు ఇంకా బాగా నచ్చుతుందని, ఇమేజ్ ప్రాసెసింగ్ లాంటివి మెరుగ్గా ఉంటాయని చెప్పడం చూసి సక్సెస్ మీట్ కొచ్చిన మీడియా షాక్ తింది. నేరుగా ఓటిటిలోనే చూడమని అర్థం వచ్చేలా చెప్పడం నిజంగా ఊహించనిది. ముందు థియేటర్ లో చూడండి, ఆ తర్వాత డిజిటల్ లో ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పడం వేరు. కానీ ఇలా స్పష్టంగా డిఫరెన్స్ వివరిస్తే వెళ్లాలనుకున్న ఆ కొద్దిమంది ఆగిపోతారుగా. బహుశా విశ్వనాథ్ రెడ్డి ఏదైనా సింగల్ స్క్రీన్ లో చూసిన అనుభవంతో అలా మాట్లాడారేమో కానీ అర్థం అయితే నెగటివ్ గా వచ్చేసింది.
అసలే ఇది సోషల్ మీడియా కాలం. పైగా 8 వసంతాలు ఎంత పొయెటిక్ గా ఉన్నా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోలేదు. చాలా చోట్ల ఆదివారం సైతం షోలు క్యాన్సిలయ్యాయని రిపోర్ట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు చేసుకునే ప్రమోషన్ మరింత బలంగా ఉండాలి. అంతే తప్ప థియేటర్ కన్నా నెట్ ఫ్లిక్స్ లో బెటర్ గా ఉంటుందని చెప్పడం కాదు. అర్హత పదంతో వైరల్ అయిన దర్శకుడు నరేంద్ర ఫనిశెట్టితో పాటు నిర్మాతలు ఎవరూ సక్సెస్ ప్రెస్ మీట్ కి హాజరు కాకపోవడం విచిత్రం. గంట కన్నా ఎక్కువ పట్టని ప్రోగ్రాంకు గైర్హాజరు కావడం కొత్త అనుమానాలు రేపుతోంది. వచ్చిన టీమ్ మాత్రం తమది సూపర్ బ్లాక్ బస్టరని చెప్పేసుకున్నారు.
This post was last modified on June 23, 2025 4:19 pm
అనుకున్నదే జరుగుతోంది. థియేటర్లలో రిలీజైనప్పటి కంటే ఓటీటీలోకి వచ్చాక ‘ది రాజాసాబ్’ మీద ట్రోలింగ్ ఇంకా ఎక్కువ జరుగుతోంది. సినిమా…
ఈ మధ్య కంటెంట్ కన్నా ఎక్కువగా కాంట్రావర్సితో వార్తల్లో నిలిచిన సినిమా బరాబర్ ప్రేమిస్తా. ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్…
ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయిన మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్.. 2021లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాక స్పీడు తగ్గించాడు.…
పదహారు సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు డిజాస్టర్. నిర్మాత నాగబాబుని నిండా ముంచేసిన సినిమా. ఇప్పుడు చూస్తేనేమో కల్ట్ క్లాసిక్. మూడోసారి…
అమరావతిలో కొత్త వెలుగులు సంతరించుకున్నాయి. గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రానికి శనివారం సాయంత్రం భూమి…
తిరుమల శ్రీవారి లడ్డూపై ప్రజల ఆలోచన ఎలా ఉంది? వారు ఏమన్నారు? ముఖ్యంగా వైసీపీ హయాంలో ఎలాంటి అభిప్రాయం ప్రజల…