‘కుబేర’ సినిమాలో హీరో ధనుషా, నాగార్జుననా అంటూ రెండు రోజులుగా వాళ్లిద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టేసుకుంటుంటే.. ఇరు వర్గాలకూ బుద్ధి చెప్పేలా వ్యవహరించారు ఆ ఇద్దరు హీరోలు. ‘కుబేర’ సక్సెస్ మీట్లో ఇటు నాగ్, అటు ధనుష్ ఎంతో హుందాగా వ్యవహరించి.. అనవసరంగా ఫ్యాన్ వార్స్ చేస్తున్న అభిమానుల నోళ్లకు తాళాలు వేసేశారు. మొన్నటి ప్రెస్ మీట్లో ఈ కథ విన్నపుడు తనే హీరో అనిపించిందని నాగ్ చెబితే.. దాన్ని మరోలా అర్థం చేసుకుని గొడవ చేశారు ధనుష్ ఫ్యాన్స్. రిలీజ్కు ముందు దర్శకుడే హీరో అని చెప్పి, హిట్టయ్యాక తనే హీరో అంటూ క్రెడిట్ తీసుకుంటున్నాడంటూ నాగ్ మీద విమర్శలు చేశారు. కానీ నాగ్ దీనిపై సక్సెస్ సెలబ్రేషన్లలో క్లారిటీ ఇచ్చాడు.
ఈ చిత్రానికి సినిమాలోని పాత్రలే హీరోలని చెబుతూ.. అందరికీ మించి దర్శకుడు శేఖర్ కమ్ములనే హీరో అని స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా తన మీద నెగెటివ్గా మీమ్స్ వేసిన, వార్తలు రాసిన వాళ్లందరి గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. నాగ్ మాట్లాడ్డానికి ముందే ధనుష్ తనదైన శైలిలో వ్యవహరించి శభాష్ అనిపించుకున్నాడు. ఇలాంటి వేడుకల్లో ముఖ్య అతిథి కంటే ముందు.. చివరగా హీరో మాట్లాడ్డం ఆనవాయితీ. ‘కుబేర’ హీరో ధనుషే అన్న ఉద్దేశంతో యాంకర్ ముందు నాగార్జునను ప్రసంగం కోసం స్టేజ్ మీదికి పిలిచారు. ఐతే ధనుష్ నాగ్ను ఆపి.. వేగంగా స్టేజ్ మీదికి వెళ్లిపోయాడు.
ఆయన కంటే ముందు నేను మాట్లాడాలి.. తర్వాత సార్ మాట్లాడాలి అంటూ నాగ్కు తగిన గౌరవాన్నిచ్చాడు. హీరో ఎవరన్నది అప్రస్తుతం, సీనియర్గా నాగ్ను గౌరవించాలని ధనుష్ భావించి ఉండొచ్చు. ఇలా చేయడం ద్వారా ధనుష్ తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న వారికి తనదైన శైలిలో బదులిచ్చాడని చెప్పొచ్చు. మరోవైపు ఈ వేడుకకు అతిథిగా వచ్చిన చిరు గురించి మాట్లాడుతూ.. ఏ పని చేసినా ఓం రాసినట్లు, సినిమాల విషయంలో చిరు పేరు తలుచుకుంటామంటూ గొప్ప కామెంట్ చేశాడు.
This post was last modified on June 23, 2025 12:42 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…