మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే రెండంకెల సంఖ్యలో సినిమాల్లోకి వచ్చారు. చిరు రక్త సంబంధీకులే కాక.. ఆయన చిన్న కూతురిని పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి ఎంటరైన కళ్యాణ్ దేవ్ సైతం హీరోగా మారిన సంగతి తెలిసిందే. అతను ఇప్పటిే ‘విజేత’ అనే సినిమా చేశాడు. దాని తర్వాత ‘సూపర్ మచ్చి’ పేరుతో మరో సినిమా మొదలుపెట్టి దాన్ని పూర్తి చేశాడు.
తొలి సినిమా నిరాశ పరిచినా.. రెండో సినిమా ఇంకా విడుదలే కాకున్నా.. కళ్యాణ్ అప్పుడే మూడో సినిమా మొదలుపెట్టేయడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో నాగశౌర్య హీరోగా వచ్చిన ‘అశ్వథ్థామ’తో దర్శకుడిగా పరిచయమైన రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు దర్శకుడెవరు అన్న దాని కంటే నిర్మాత ఎవరన్నది ఆసక్తి రేకెత్తించే విషయం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరైన మిత్రుల్లో ఒకడైన రామ్ తాళ్ళూరి చిరు చిన్నల్లుడి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఇండస్ట్రీయలిస్ట్ అయిన రామ్.. పవన్ రాజకీయ పార్టీ జనసేనకు ముందు నుంచి ఫండింగ్ చేస్తుండటంతో పాటు తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బేనర్ పెట్టి చుట్టాలబ్బాయ్, నేల టిక్కెట్టు, డిస్కో రాజా సినిమాలను నిర్మించారు. వాటిలో ఏదీ సరైన ఫలితాన్నివ్వలేదు. ‘డిస్కో రాజా’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఈసారి కళ్యాణ్ దేవ్తో చిన్న సినిమాను లైన్లో పెట్టాడు.
గురువారం ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్నందిస్తుండగా.. దేశ్ రాజ్ అనే కొత్త రచయిత దీనికి కథ అందించాడు.
This post was last modified on November 12, 2020 3:37 pm
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…