మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే రెండంకెల సంఖ్యలో సినిమాల్లోకి వచ్చారు. చిరు రక్త సంబంధీకులే కాక.. ఆయన చిన్న కూతురిని పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి ఎంటరైన కళ్యాణ్ దేవ్ సైతం హీరోగా మారిన సంగతి తెలిసిందే. అతను ఇప్పటిే ‘విజేత’ అనే సినిమా చేశాడు. దాని తర్వాత ‘సూపర్ మచ్చి’ పేరుతో మరో సినిమా మొదలుపెట్టి దాన్ని పూర్తి చేశాడు.
తొలి సినిమా నిరాశ పరిచినా.. రెండో సినిమా ఇంకా విడుదలే కాకున్నా.. కళ్యాణ్ అప్పుడే మూడో సినిమా మొదలుపెట్టేయడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో నాగశౌర్య హీరోగా వచ్చిన ‘అశ్వథ్థామ’తో దర్శకుడిగా పరిచయమైన రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు దర్శకుడెవరు అన్న దాని కంటే నిర్మాత ఎవరన్నది ఆసక్తి రేకెత్తించే విషయం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరైన మిత్రుల్లో ఒకడైన రామ్ తాళ్ళూరి చిరు చిన్నల్లుడి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఇండస్ట్రీయలిస్ట్ అయిన రామ్.. పవన్ రాజకీయ పార్టీ జనసేనకు ముందు నుంచి ఫండింగ్ చేస్తుండటంతో పాటు తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బేనర్ పెట్టి చుట్టాలబ్బాయ్, నేల టిక్కెట్టు, డిస్కో రాజా సినిమాలను నిర్మించారు. వాటిలో ఏదీ సరైన ఫలితాన్నివ్వలేదు. ‘డిస్కో రాజా’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఈసారి కళ్యాణ్ దేవ్తో చిన్న సినిమాను లైన్లో పెట్టాడు.
గురువారం ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్నందిస్తుండగా.. దేశ్ రాజ్ అనే కొత్త రచయిత దీనికి కథ అందించాడు.
This post was last modified on November 12, 2020 3:37 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…