మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే రెండంకెల సంఖ్యలో సినిమాల్లోకి వచ్చారు. చిరు రక్త సంబంధీకులే కాక.. ఆయన చిన్న కూతురిని పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి ఎంటరైన కళ్యాణ్ దేవ్ సైతం హీరోగా మారిన సంగతి తెలిసిందే. అతను ఇప్పటిే ‘విజేత’ అనే సినిమా చేశాడు. దాని తర్వాత ‘సూపర్ మచ్చి’ పేరుతో మరో సినిమా మొదలుపెట్టి దాన్ని పూర్తి చేశాడు.
తొలి సినిమా నిరాశ పరిచినా.. రెండో సినిమా ఇంకా విడుదలే కాకున్నా.. కళ్యాణ్ అప్పుడే మూడో సినిమా మొదలుపెట్టేయడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో నాగశౌర్య హీరోగా వచ్చిన ‘అశ్వథ్థామ’తో దర్శకుడిగా పరిచయమైన రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు దర్శకుడెవరు అన్న దాని కంటే నిర్మాత ఎవరన్నది ఆసక్తి రేకెత్తించే విషయం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరైన మిత్రుల్లో ఒకడైన రామ్ తాళ్ళూరి చిరు చిన్నల్లుడి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఇండస్ట్రీయలిస్ట్ అయిన రామ్.. పవన్ రాజకీయ పార్టీ జనసేనకు ముందు నుంచి ఫండింగ్ చేస్తుండటంతో పాటు తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బేనర్ పెట్టి చుట్టాలబ్బాయ్, నేల టిక్కెట్టు, డిస్కో రాజా సినిమాలను నిర్మించారు. వాటిలో ఏదీ సరైన ఫలితాన్నివ్వలేదు. ‘డిస్కో రాజా’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఈసారి కళ్యాణ్ దేవ్తో చిన్న సినిమాను లైన్లో పెట్టాడు.
గురువారం ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్నందిస్తుండగా.. దేశ్ రాజ్ అనే కొత్త రచయిత దీనికి కథ అందించాడు.
This post was last modified on November 12, 2020 3:37 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…