Movie News

ట్రైన్ ప్రయాణంలో పెద్దికి ఏం పని

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్దికి సంబంధించిన కీలక ఎపిసోడ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ ఎత్తున వేసిన ట్రైన్ సెట్ లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇది ఇప్పటిదాకా చూడని స్థాయిలో ఉంటుందని, గతంలో ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో లెక్కలేనన్ని సినిమాలు వచ్చినప్పటికీ నెవర్ బిఫోర్ తరహాలో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది ప్రారంభంలో వచ్చే చరణ్ ఇంట్రోగా వస్తుందట. హై ఇంటెన్స్ యాక్షన్ తో ఈ స్థాయి పరిచయం ఈ మధ్య ఎవరికీ జరగలేదనే స్థాయిలో ఉంటుందట.

ఫైట్ మాస్టర్ నభాకాంత్  నేతృత్వంలో ఈ మొత్తం ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉంటుందని ఊరిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా ఉందని సెట్ చూసిన వాళ్ళ మాట. ఇదిలా ఉండగా అనుకున్న టైం కన్నా చాలా ముందగానే పెద్ది షూట్ అయిపోయేలా ఉంది. ఇంకా పాటల చిత్రీకరణ మొదలుపెట్టనప్పటికీ ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేసి ఆపై వాటి సంగతి చూస్తారట. ఈ ఏడాది చివర్లోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో చరణ్, బుచ్చిబాబు ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మార్చి 27 విడుదల ఇంకా దూరంలో ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు ఎక్కువ సమయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

మైత్రి, వృద్ధి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ విలేజ్ డ్రామాలో జాన్వీ కపూర్, దివ్యెందు, శివరాజ్ కుమార్, జగపతిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం పట్ల కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అవి టీజర్ తో తగ్గాయి. ఫైనల్ అవుట్ ఫుట్ కి కూడా ఇంతే బ్రహ్మాండంగా ఇవ్వాలని ఫాన్స్ కోరుతున్నారు. క్వాలిటీ విషయంలో బుచ్చిబాబు రాజీ పడటం లేదు. మేకింగ్ స్టిల్స్ తో పాటు చిన్న చిన్న వీడియోలు వదులుతూ అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాడు. దీని తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే ఆర్సి 17 తాలూకు స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే  కొలిక్కి రావొచ్చని వినికిడి.

This post was last modified on June 18, 2025 10:56 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago