హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ టీమ్ స్పందించడం మానేసింది. జూన్ 12 పోస్ట్ పోన్ అప్డేట్, అది కూడా చాలా ఆలస్యంగా ఇవ్వడం తప్ప ఇంకెలాంటి మూమెంట్ లేదు, జూలై 18 రిలీజవుతుందని ఫిలిం నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు కానీ నిజంగా వస్తుందా రాదానేది అంతు చిక్కడం లేదు. సిజి వర్క్ అయిపోయింది. ఫైనల్ కాపీ పనులు వేగవంతమయ్యాయి. ట్రైలర్ ఎడిటింగ్ జరుగుతోందని మెగా కాంపౌండ్ న్యూస్. అదెప్పుడు వదులుతారనేది భేతాళ ప్రశ్న. సమాధానం లేక అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
సెప్టెంబర్ 25 డేట్లో ఎలాంటి మార్పు లేకపోతే ఓజి రావడానికి వంద రోజుల టైం కూడా లేదు. వీరమల్లు కోసమే దాని ప్రమోషన్లను ఆపింది డివివి ఎంటర్ టైన్మెంట్స్. కానీ ఎక్కువ ఆలస్యం చేస్తే దాని ప్రభావం తమ మీద కూడా పడుతుందేమోననే ఆందోళన వాళ్లలో కలగడం సహజం. ఓజికి హైప్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. విఎఫ్ఎక్స్ సినిమా కాకపోయినా, రాజమౌళి లాంటి దర్శకుడు హ్యాండిల్ చేయకపోయినా కేవలం టీజర్, టైటిల్ తోనే విపరీతమైన బజ్ పెంచేసుకుంది. హఠాత్తుగా రిలీజ్ చేసినా మొదటి రోజు రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. కానీ దానికన్నా ముందు వీరమల్లుకి రూట్ క్లియర్ కావాలి.
జనంలో క్రమంగా హరిహర వీరమల్లు మీద ఆసక్తి తగ్గిపోతున్న వైనం సోషల్ మీడియాలో గమనించవచ్చు. ట్రైలర్ తో మొత్తం మారిపోతుందనే అతి విశ్వాసం ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుంది. ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా ఒక క్రమ పద్ధతిలో ప్రమోషన్లు చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ జూలై 18 లాక్ అనుకుంటే కేవలం నెల మాత్రమే టైం ఉంది. కాబట్టి అర్జెంట్ గా ఒక ప్రణాళిక వేసుకోవాలి. దీని కోసమే కింగ్ డమ్ లాంటి ఇతర సినిమాలు డేట్లు వేసుకోకుండా ఎదురు చూస్తున్నాయి. సో వీలైనంత త్వరగా వీరమల్లు క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగడం చాలా అవసరం.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…