ఈ ఏడాది ఆరంభంలో మలయాళంలో బ్లాక్బస్టర్ అయిన ‘అయ్యప్పనుం కోషీయుం’ సినిమా రీమేక్ హక్కులను.. సినిమా విడుదలైన కొన్ని రోజులకే సొంతం చేసుకుంది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. ఇక అప్పట్నుంచి లీడ్ రోల్స్ కోసం సాగిన వేట ఎంతకీ తెగలేదు. ముందు ప్రధాన పాత్రలకు ప్రచారం జరిగిన పేర్లు వేరు. చివరికేమో ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ లైన్లోకి వచ్చాడు. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రను పవన్ చేయబోతున్నట్లు వెల్లడైంది. మరి పృథ్వీరాజ్ చేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ పాత్ర ఎవరిది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
నిజానికి పవన్ పేరు పరిగణనలోనే లేనపుడు పృథ్వీరాజ్ పాత్రకు రానా ఓకే అయినట్లు కొన్ని నెలల కిందటే వార్తలొచ్చాయి. ఇంకో పాత్ర విషయంలోనే సస్పెన్స్ అంతా అన్నారు. తీరా చూస్తే అవతలి పాత్రకు పవన్ ఓకే అయ్యాడు. మరో పాత్ర విషయంలో సస్పెన్స్ నడుస్తోంది.
రానాతో పాటుగా సాయిధరమ్ తేజ్, నితిన్, సుదీప్.. ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎక్కువమంది చూపు రానా వైపే ఉంది. ఇదే విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానాను అడిగితే.. అతను ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం తనను నిర్మాతలు సంప్రదించిన వాస్తమే అన్నాడతను. ఐతే తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఏమీ ఫైనలైజ్ కాలేదని.. సరైన సమయంలో దీనిపై నిర్ణయం వెలువడుతుందని, అంత దాకా ఎదురు చూడాలని అన్నాడు. అతడి మాటల్ని బట్టి చూస్తే రానాకు ఈ పాత్రకు కంటెండరే అనే విషయం స్పష్టమవుతోంది.
మరి పవన్తో నటించే అవకాశం వస్తే రానా ఇంకా ఆలోచిస్తున్నాడా.. లేక అతణ్ని ఓకే చేసే విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారా అన్నది తెలియడం లేదు. ఈ పాత్ర ఓకే అయితే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టేయాలన్నది చిత్ర బృందం ప్లాన్.
This post was last modified on November 11, 2020 2:01 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…