Movie News

సురేందర్ రెడ్డికి ‘ఎస్’ చెప్పిన పవన్ ?

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సినిమాల తర్వాత కొత్తవి చేసే అవకాశం ఉండకపోవచ్చని సినీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. హరిహర వీరమల్లు పార్ట్ 1, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం రిలీజ్ కు కాబోతున్నవి. ఇవి కాకుండా వీరమల్లు పార్ట్ 2 తెరకెక్కాల్సి ఉంది. మరి తర్వాత జనసేన కోసం పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతారా అనేది అభిమానుల మెదడును తొలుస్తున్న ప్రశ్న. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే రామ్ తాల్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పవన్ ఒక స్క్రిప్ట్ కి మూడేళ్ళ క్రితమే ఎస్ చెప్పారు. తర్వాత ఆఫీస్ తీసి పూజా కార్యక్రమాల ఫొటోలు కూడా పెట్టారు.

తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఇది మెల్లగా సైడ్ లైన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం, తర్వాత ఉపముఖ్యమంత్రిగా పాలనలో బిజీ కావడం లాంటి సంఘటనలు దీన్ని మర్చిపోయేలా చేశాయి. తర్వాత క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం కూడా జరిగింది. తాజా అప్డేట్ ఏంటంటే ఇటీవలే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిశాడట. స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్న విషయాన్ని వివరించి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే సాధ్యాసాధ్యాలు చర్చించినట్టు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ అంతర్గత వర్గాలు చెబుతున్న ప్రకారం భేటీ జరిగింది. నిజమైతే మాత్రం సురేందర్ రెడ్డి జాక్ పాట్ కొట్టినట్టే.

అయితే ఏజెంట్ ఇచ్చిన దర్శకుడిగా సురేందర్ రెడ్డి మీద కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం, అతనొక్కడే లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ గా తనని మరీ తక్కువంచనా వేయలేం. పైగా పవన్ ట్రాక్ రికార్డు చూసి ఛాన్స్ ఇచ్చే బాపతు కాదు. కథ నచ్చి, వర్కౌట్ అవుతుందని భావిస్తే గుడ్డిగా ముందుకెళ్ళిపోతారు. కంబ్యాక్ అవ్వాల్సిన ఒత్తిడిలో సురేందర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఉంటాడని టాక్. ఒకవేళ ఓకే అయితే మాత్రం 2026 వేసవిలో షూటింగ్ మొదలుపెట్టొచ్చు. అయిదారు నెలల్లో పూర్తి చేసేలా స్టోరీ ఉందట. ఈ కలయిక ఏ మేరకు సాధ్యమవుతుందో చూడాలి.

This post was last modified on June 12, 2025 11:01 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

10 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

36 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago