ఈ నెల 20న కుబేరతో పాటు 8 వసంతాలు అనే చిన్న సినిమా విడుదలవుతోంది. బడ్జెట్ పరంగా ఎంతయ్యిందనేది పక్కన పెడితే మైత్రి బ్యానర్ కావడంతో ఒక వర్గం మూవీ లవర్స్ లో దీని మీద మంచి ఆసక్తి నెలకొంది. దర్శకుడు నరేంద్ర ఫనిశెట్టి గతంలో మను అనే క్రౌడ్ ఫండింగ్ మూవీ తీశాడు. క్రిటిక్స్ ఏమో కానీ సాధారణ ప్రేక్షకులకు నచ్చక బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది. ఇప్పుడీ 8 వసంతాలు తీసింది ఇతనే. తాజాగా మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆడియన్స్ అర్హత గురించి అతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రకరకాల కోణాల్లో డిస్కషన్లు జరుగుతూ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చేస్తున్నాయి.
ఇంతకీ నరేంద్ర ఫనిశెట్టి అన్న పాయింట్ ఏంటంటే థగ్ లైఫ్ చూసి కొందరు మణిరత్నం, కమల్ హాసన్ లాంటి వాళ్ళు సినిమా ఎలా తీయాలో చెబుతున్నారని, అంత అర్హత మనకు ఉందో లేదో చూసుకోవాలని అన్నారు. నలభై ఏళ్ళ క్రితం వాళ్ళు క్లాసిక్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు పుట్టి ఉండరని మరో వ్యాఖ్య చేశారు. అతని ఉద్దేశం ఏదైనా అర్హత అనే పెద్ద పదం వాడటం తన కామెంట్స్ మీద నెగటివిటీని తెస్తున్నాయి. వందా రెండు వందలు ఖర్చు పెట్టి సినిమా చూసే జనాలకు వాళ్లకు నచ్చింది ఇవ్వకపోతే ఖచ్చితంగా విమర్శలు చేస్తారు, ఫ్లాప్ చేతిలో పెడతారు. ఇక్కడ డెబ్యూ డైరెక్టరా లేక లెజెండరీ పర్సనా అనే లెక్కలు ఉండవు.
అందుకే కదా శంకర్ లాంటి జీనియస్ సైతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రూపంలో దెబ్బలు తిన్నది. పొన్నియిన్ సెల్వన్ బయట రాష్ట్రాల్లో ఎక్కడ ఆడింది. కాబట్టి ఒకప్పుటి ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకుని సింపతితో సినిమాలు చూసే రోజులు కావివి. తేడా కొడితే రిలీజ్ రోజు ఉదయం షోకే ప్యాన్ ఇండియా మూవీస్ బకెట్ తన్నేస్తున్నాయి. అలాంటప్పుడు అర్హత లాంటి పెద్ద మాటలు కవ్వించినట్టు అవుతుంది తప్ప మద్దతు తెచ్చుకోదు. ఏదైతేనేం ఇప్పుడీ టాపిక్ పుణ్యమాని 8 వసంతాలకు కాసింత ఉచిత్ర ప్రచారం దొరికేసింది. జూన్ 20న నరేంద్ర ఫణిశెట్టి సాలిడ్ కంటెంట్ తో రుజువు చేసుకోవాలి. అందులోనూ కుబేరతో పోటీ ఉంది.
This post was last modified on June 12, 2025 9:59 am
నిన్న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ పక్క రాష్ట్రం, ఇతర తెలుగు…
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తన పూజ గదిలో ఉన్న బొమ్మలపై సోషల్ మీడియాలో వస్తున్న…
దాదాపు దశాబ్ద కాలం నుంచి హీరో అల్లు అర్జున్కు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పడట్లేదన్న సంగతి తెలిసిందే.…
వివాహేతర సంబంధాలు ఎంతకైనా తెగించేలా చేస్తున్న రోజులు ఇవి!. భర్తలపై భార్యలు, భార్యలపై భర్తలు కసి తీర్చుకుంటున్నారు.(అందరూ కాదు.. 100కు…
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…