ఈ నెల 20న కుబేరతో పాటు 8 వసంతాలు అనే చిన్న సినిమా విడుదలవుతోంది. బడ్జెట్ పరంగా ఎంతయ్యిందనేది పక్కన పెడితే మైత్రి బ్యానర్ కావడంతో ఒక వర్గం మూవీ లవర్స్ లో దీని మీద మంచి ఆసక్తి నెలకొంది. దర్శకుడు నరేంద్ర ఫనిశెట్టి గతంలో మను అనే క్రౌడ్ ఫండింగ్ మూవీ తీశాడు. క్రిటిక్స్ ఏమో కానీ సాధారణ ప్రేక్షకులకు నచ్చక బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది. ఇప్పుడీ 8 వసంతాలు తీసింది ఇతనే. తాజాగా మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆడియన్స్ అర్హత గురించి అతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రకరకాల కోణాల్లో డిస్కషన్లు జరుగుతూ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చేస్తున్నాయి.
ఇంతకీ నరేంద్ర ఫనిశెట్టి అన్న పాయింట్ ఏంటంటే థగ్ లైఫ్ చూసి కొందరు మణిరత్నం, కమల్ హాసన్ లాంటి వాళ్ళు సినిమా ఎలా తీయాలో చెబుతున్నారని, అంత అర్హత మనకు ఉందో లేదో చూసుకోవాలని అన్నారు. నలభై ఏళ్ళ క్రితం వాళ్ళు క్లాసిక్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు పుట్టి ఉండరని మరో వ్యాఖ్య చేశారు. అతని ఉద్దేశం ఏదైనా అర్హత అనే పెద్ద పదం వాడటం తన కామెంట్స్ మీద నెగటివిటీని తెస్తున్నాయి. వందా రెండు వందలు ఖర్చు పెట్టి సినిమా చూసే జనాలకు వాళ్లకు నచ్చింది ఇవ్వకపోతే ఖచ్చితంగా విమర్శలు చేస్తారు, ఫ్లాప్ చేతిలో పెడతారు. ఇక్కడ డెబ్యూ డైరెక్టరా లేక లెజెండరీ పర్సనా అనే లెక్కలు ఉండవు.
అందుకే కదా శంకర్ లాంటి జీనియస్ సైతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రూపంలో దెబ్బలు తిన్నది. పొన్నియిన్ సెల్వన్ బయట రాష్ట్రాల్లో ఎక్కడ ఆడింది. కాబట్టి ఒకప్పుటి ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకుని సింపతితో సినిమాలు చూసే రోజులు కావివి. తేడా కొడితే రిలీజ్ రోజు ఉదయం షోకే ప్యాన్ ఇండియా మూవీస్ బకెట్ తన్నేస్తున్నాయి. అలాంటప్పుడు అర్హత లాంటి పెద్ద మాటలు కవ్వించినట్టు అవుతుంది తప్ప మద్దతు తెచ్చుకోదు. ఏదైతేనేం ఇప్పుడీ టాపిక్ పుణ్యమాని 8 వసంతాలకు కాసింత ఉచిత్ర ప్రచారం దొరికేసింది. జూన్ 20న నరేంద్ర ఫణిశెట్టి సాలిడ్ కంటెంట్ తో రుజువు చేసుకోవాలి. అందులోనూ కుబేరతో పోటీ ఉంది.
This post was last modified on June 12, 2025 9:59 am
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ…
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…