పబ్లిక్ స్టేజి మీద నిజాలతో కూడిన ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇవ్వడం అరుదు. అందులోనూ స్టార్ హీరోల నుంచి వీటిని ఆశించడం తక్కువ. ఇవాళ ముంబైలో జరిగిన కుబేర సాంగ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ మేమెవ్వరం రెండు మూడు వేల కోట్ల హీరోలం కాదని, రష్మిక మందన్న మాత్రం ఆ క్లబ్బులో చేరిపోయిందని యానిమల్, పుష్ప 2, చావాలను ఉద్దేశించి చెప్పడంతో ఒక్కసారిగా ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కుబేర గురించి చెబుతున్న క్రమంలో శేఖర్ కమ్ములతో పని చేయడానికి 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఈ సినిమాతో అది నెరవేరిందని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు.
ధనుష్, రష్మిక మందన్నలు సైతం బోలెడు కబుర్లు పంచేసుకున్నారు. ఏడు గంటల పాటు డంప్ యార్డ్ లో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రష్మిక చాలా సులభంగా తట్టుకుందని, ఆమెకు వాసన రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పిన ధనుష్ కుబేర కోసం ఎలాంటి పరిశోధన చేయలేదని, శేఖర్ కమ్ముల ఎలా చెబితే అలా చేసుకుంటూ వెళ్లిపోయానని నిజాయితీగా ఒప్పేసుకున్నారు. మాములుగా కొందరు హీరోలు బిచ్చగాడి పాత్ర చేయాల్సి వచ్చినపుడూ వాళ్ళను కలిశామని, కొన్ని రోజులు వీధుల్లో తిరిగామని ఏవేవో అల్లేస్తారు. దానికి భిన్నంగా ధనుష్ ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం విశేషం.
విలన్ జిమ్ షర్బ్ గురించి నాగార్జున ప్రత్యేక ప్రశంసలు అందించడం గమనార్హం. తనకంటే తెలుగు బాగా మాట్లాడాడంటూ ప్రత్యేక కితాబు ఇచ్చేశారు. ఒకప్పుడు శివ లాంటి క్లాసిక్స్ ని బాలీవుడ్ కిచ్చిన నాగార్జున మళ్ళీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారనే ప్రశ్నకు సమాధానంగా కుబేరతో పాటు కూలి హిందీలో వస్తున్నాయని, ఇప్పుడు బాషా భేదాలు లాంటివి లేకుండా అన్నింటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని బదులు చెప్పారు. క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఏదీ రివీల్ చేయలేనని, సినిమా చూశాక తెలుసుకుంటారని చెప్పిన నాగార్జున ఆద్యంతం మంచి హుషారుగా కనిపించారు. జూన్ 20 కుబేర ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
This post was last modified on June 10, 2025 8:02 pm
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…