Political News

ఏలూరు ‘సాక్షి’ ఆఫీసుకు నిప్పు.. ఎవ‌రి ప‌ని?!

ఏలూరు జిల్లాలోని ‘సాక్షి’ కార్యాల‌యానికి కొంద‌రు దుండ‌గులు నిప్పంటించారు. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి ప‌డి.. ఫ‌ర్నిచ‌ర్ స‌హా.. ప‌లు కీల‌కవ‌స్తువులు, వాహ‌నాలు కూడా ద‌హ‌నమ‌య్యాయి. అయితే.. ఈ ఘ‌ట‌న‌పై రెండు ర‌కాల వాద‌న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇదంతా టీడీపీ త‌ర‌ఫున నిర‌స‌న‌ల పేరుతో అరాచ‌కాల‌కు దిగిన వారి ప‌నేన‌ని సాక్షి ప్ర‌తినిధులు చెబుతు న్నారు. పోలీసులు కూడా అక్క‌డే ఉన్నా.. ఎవ‌రినీ అదుపు చేయ‌లేద‌ని.. నిప్పు పెట్టి మంట‌లుఎగ‌సేలా చేసినా.. కూడా ప‌ట్టిం చుకోలేద‌ని ఆరోపించారు. బీరు బాటిళ్ల‌ను, పెట్రో బాటిళ్ల‌ను కూడా మంట‌ల్లో వేసి.. మ‌రింత ర‌గిలే చేశార‌ని ఆరోపించారు.

ఇక‌, ఈ వాద‌న‌ల‌ను టీడీపీ నాయ‌కులు ఖండిస్తున్నారు. తాము శాంతి యుత నిర‌స‌న‌ల‌కు మాత్ర‌మే పిలుపునిచ్చామ‌ని.. మహిళ‌లు ఆగ్ర‌హించి.. నిర‌స‌న వ్య‌క్తం చేశార‌ని.. తెలిపారు. కేవ‌లం శాంతి యుతంగానే కార్యాల‌యం ముందు ధ‌ర్నా నిర్వ‌హించినట్టు తెలిపారు. పైగా.. ఆందోళ‌న ముగిసి, మ‌హిళ‌లు అక్క‌డ నుంచి వెళ్లిపోయిన త‌ర్వాత‌.. ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్నారు. దీనిలో ఆందోళ‌న కారుల పాత్ర లేద‌ని.. సాక్షి ఉద్యోగులే ఆందోళ‌న కారుల ముసుగులో వ‌చ్చి.. నిప్పు పెట్టి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇదంతా ఉద్దేశపూర్వ‌కంగా సాక్షి యాజ‌మాన్య‌మే చేయించిన‌ట్టు టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. ఏలూరులోని సాక్షి కార్యాల‌యం అయితే.. త‌గుల‌బ‌డింది. భారీ ఎత్తున మంట‌లు వ్యాపించాయి. ప‌క్క‌నే కార్లు, వాహ‌నాలు కూడా ఉండ‌డంతో తీవ్ర ఆందోళ‌న రేకెత్తింది. కానీ, ప‌క్క‌నే పోలీసులు ఉన్నా.. అటు ఇటు ప‌రిగెత్తారే త‌ప్ప‌.. మంట‌ల‌ను ఆర్పేందుకు మాత్రం ప్ర‌య‌త్నించ‌లేద‌ని.. ప్ర‌త్య‌క్షంగా చూసిన వారు చెబుతున్నారు. దీనికి సంబంధించి ప‌లు వీడియోలు కూడా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. మ‌రోవైపు సోమ‌వారం కూడా.. అమ‌రావ‌తి రాజ‌ధాని మ‌హిళ‌ల‌కు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్టినా.. ఎక్క‌డా నిప్పు పెట్ట‌డం.. అరాచ‌కాలు సృష్టించ‌డం వంటివి చేయ‌లేదు. కానీ, మంగ‌ళ‌వారం అంతా స‌ర్దుమ‌ణిగిపోతున్న స‌మ‌యంలో అనూహ్యంగా సాక్షి ఆఫీసులో మంట‌లు రేగ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on June 10, 2025 10:21 pm

Share

Recent Posts

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

1 hour ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

1 hour ago

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

5 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

6 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

7 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

8 hours ago