రేపు అఖండ 2 తాండవం టీజర్ రాబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు అందులో విడుదల తేదీ సెప్టెంబర్ 25 ఉందట. షూటింగ్ ప్రారంభమైనప్పుడు ప్రకటించిన తేదీకే కట్టుబడుతున్నారు. ఇటీవలే ఓజి కూడా అదే డేట్ ని చెప్పేసుకుంది. అంటే బాలయ్య, పవన్ కళ్యాణ్ క్లాష్ తప్పకపోవచ్చు. అయితే బయ్యర్లు మాత్రం ఈ ఫేస్ ఆఫ్ ని కోరుకోవడం లేదు. ఎందుకంటే సంక్రాంతిలాగా దసరా పండగ భీభత్సమైన సీజన్ కాదు. సెలవులు ఉంటాయి కానీ సంక్రాంతి లాగా జనాలు నగరాలు వదిలి స్వంత ఊళ్లకు వెళ్లేంత సీన్ ఎక్కువగా ఉండదు. ఆ కారణంగానే రెండు పండగల మధ్య నమోదయ్యే నెంబర్లలో తేడా ఉంటుంది.
ఒకవేళ నిజంగా అఖండ 2, ఓజి కనక తలపెడితే ఒక్కో సెంటర్లో ఒక్కోలా ఒకరిమీద మరొకరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బిసి సెంటర్స్ లో బాలయ్య డామినేషన్ ఉండొచ్చు. నైజాం లాంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ యుఫోరియా మాములుగా ఉండదు. చిన్న కేంద్రాల్లో రెండు మూడు స్క్రీన్లే అందుబాటులో ఉంటాయి. వాటిలో షోలు సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. సంక్రాంతికి మేనేజ్ చేయడం వేరు కానీ దసరాకి సీన్ మారిపోతుంది. 14 రీల్స్, డివివి ఎంటర్ టైన్మెంట్స్ వరస చూస్తుంటే ఎవరూ తగ్గేలా లేరని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రేపు సాయంత్రం అఖండ 2 క్లారిటీ రానుంది.
ఒకవేళ కాంపిటీషన్ అనివార్యమైతే మాత్రం సీన్ రసవత్తరంగా మారిపోతుంది. కూటమి డిప్యూటీ సిఎం వర్సెస్ కూటమి ఎమ్మెల్యే పరస్పరం కవ్వించుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ క్షేత్ర స్థాయిలో ఈ దిశగా నిర్ణయం జరుగుతోందనే సంగతి పవన్ కళ్యాణ్, బాలయ్యలకు తెలుసో లేదోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. అఖండ 2 షూటింగ్ కీలక దశకు చేరుకుంది. జార్జియా షెడ్యూల్ లో ముప్పాతిక శాతం పూర్తయినట్టేనని సమాచారం. ఓజిలో తన భాగం పవన్ ఫినిష్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. బోయపాటి శీను, సుజిత్ లు వేగం విషయంలో నువ్వా నేనాని పరుగులు పెట్టేలా ఉన్నారు.
This post was last modified on June 9, 2025 5:40 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…