పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే చెప్పిన డేట్కు రాదు అనే అభిప్రాయం బలపడిపోతోంది. చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయినా కుదిరినపుడు వీలు చేసుకుని సినిమాల్లో నటిస్తున్నారు. కానీ పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తారో.. ఎప్పుడు సినిమా పూర్తవుతుందో స్పష్టత ఉండట్లేదు. దీని వల్ల ఆయన చేసే ప్రతి సినిమాకూ ముందు చెప్పిన డేట్ మారిపోతోంది. ‘హరిహర వీరమల్లు’ అయితే ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూ వచ్చింది. పలుమార్లు డేట్లు మార్చాక జూన్ 12ను ఎంచుకున్నారు కానీ.. ఆ తేదీకి కూడా సినిమా రావట్లేదు. ప్రస్తుతం జులైలో కొత్త డేట్ చూస్తున్నారు. త్వరలోనే డేట్ ప్రకటించబోతున్నారు. ఆ డేట్కు సినిమా వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఐతే ‘హరిహర వీరమల్లు’ సంగతెలా ఉన్నా.. పవన్ తర్వాతి చిత్రం ‘ఓజీ’ మాత్రం పక్కాగా చెప్పిన డేట్కే వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ డేట్కు ఇంకా మూడున్నర నెలల సమయం ఉంది. ఈలోపే పవన్ ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసేయడం విశేషం. పవన్ ఇందులో ఓజాస్ గంభీర అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గత నెలలోనే తిరిగి ‘ఓజీ’ సెట్లోకి అడుగుపెట్టారు. కొన్ని వారాల పాటు కంటిన్యూగా అందుబాటులో ఉండి తన పాత్ర వరకు చిత్రీకరణ పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది కూడా.
పవన్ పాత్రకు సంబంధించి షూట్ పూర్తయిందంటే సినిమాను ముగించడం ఇక లాంఛనమే. మిగతా ఆర్టిస్టులంతా అందుబాటులో ఉండడంతో ఇంకొన్ని వారాల్లో సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. ‘హరిహర వీరమల్లు’ లాగా దీనికి బిజినెస్ సమస్యలు కూడా లేవు. మాంచి డిమాండ్ ఉంది. కాబట్టి సెప్టెంబరు 25న గ్రాండ్ సెలబ్రేషన్లకు అభిమానులు రెడీ అయిపోవచ్చు.
This post was last modified on June 8, 2025 3:41 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…