మహేష్ బాబు సోదరి మంజులది టాలీవుడ్లో విభిన్న ప్రస్థానం. ఆమె ముందు కథానాయిక కావాలనుకుంది. కానీ కృష్ణ అభిమానులు అందుకు ఎంతమాత్రం అంగీకరించకపోవడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది. అయినా సరే.. ఆశ చంపుకోక చాలా ఏళ్ల తర్వాత ‘షో’ లాంటి విభిన్న చిత్రంతో కథానాయికగా కాకుండా నటిగా అరంగేట్రం చేసింది. ఆ సినిమాను ప్రొడ్యూస్ కూడా చేసి జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. ఆ తర్వాత మంజుల మరికొన్ని సినిమాల్లో నటించడంతో పాటు ప్రొడక్షన్లోనూ భాగమైంది.
చివరగా ఆమె మెగా ఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అంటూ ఓ సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమాకు చేదు అనుభవం ఎదురవడంతో మంజుల మళ్లీ సినిమాల వైపు చూడలేదు. ఐతే ఈ మధ్య ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
ఐతే మంజులగా కంటే కృష్ణ కూతురిగా, మహేష్ సోదరిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తన తండ్రి, తమ్ముడి గురించి తరచుగా మాట్లాడుతుంటుంది. ముఖ్యంగా మహేష్ గురించి మాట్లాడితే రీచ్ ఎక్కువ కాబట్టి అతడి గురించి వీలు చిక్కినపుడల్లా చర్చిస్తుంటుంది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఒక టీవీ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. తమ్ముడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మంజుల.
మహేష్ తన కంటే చిన్నవాడే కానీ.. తనకంటే అతడికి మెచ్యూరిటీ ఎక్కువ అని ఆమె వ్యాఖ్యానించింది. తన కెరీర్ విషయంలో, వ్యక్తిగత జీవితంలో మహేష్ అనేక విలువైన సలహాలు ఇస్తుంటాడని ఆమె అంది. మహేష్కు సంబంధించిన అనేక సీక్రెట్లు ఉన్నాయని.. వాటిని అభిమానులతో త్వరలో పంచుకుంటానని అంది. బహుశా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారానే మంజుల ఈ విషయాలన్నీ చెబుతుందేమో చూడాలి.
This post was last modified on November 9, 2020 1:41 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…