Political News

వైసీపీ సోషల్ మీడియా టీంలో అసంతృప్తా ?

జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు 2014 నుండి మొన్నటి ఎన్నికల వరకు అలుపెరగకుండా గట్టిగా కృషి చేస్తున్న సోషల్ మీడియా విభాగాన్ని పెద్దలు నిర్లక్ష్యం చేస్తున్నారనే అసంతృప్తి మొదలైంది. నిజానికి 2014లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించటంలో పార్టీ సోషల్ మీడియా విభాగానిది చాలా కీలక పాత్రనటంలో సందేహం లేదు. అయితే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకనో టీడీపీ పెద్దలు సోషల్ మీడియా విభాగాన్ని పక్కన పెట్టేశారు.

ఎక్కడైతే సోషల్ మీడియా విభాగాన్ని టీడీపీ కాడిదింపేసిందో సరిగ్గా అక్కడే వైసీపీ సోషల్ మీడియా విభాగం బాగా యాక్టివ్ అయ్యింది. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసీపీ సోషల్ మీడియా విభాగం యాక్టివ్ అయిపోయిన విషయం అందరికీ అర్ధమైపోయింది. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటేనే చంద్రబాబు, చినబాబు లోకేష్ తో పాటు యావత్ టీడీపీ యాక్టివిటీస్ కు వ్యతిరేకంగా ఆకాశమే హద్దుగా వైసీపీ సోషల్ మీడియి విభాగం రెచ్చిపోయింది. దాంతో సోషల్ మీడియా విభాగాన్ని తట్టుకోవటం నిజంగా టీడీపీకి చాలా కష్టమైంది.

అందుకనే వైసీపీకి అనుకూలంగా కానీ లేదా చంద్రబాబు, లోకేష్, టీడీపీకి వ్యతిరేకంగా యాక్టివ్ గా ఉన్న ఎంతోమందిని అప్పట్లో పోలీసులు అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. ఎంతమంది మీద కేసులు పెట్టినా, అరెస్టు చేసినా వైసీపీ సోషల్ మీడియా విభాగం వెనక్కు తగ్గలేదు. తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ను హైలైట్ చేయటంలో సోషల్ మీడియా విభాగం తరపున పనిచేస్తున్న వారి కృషి అందరికీ తెలిసిందే.

అలాంటిది వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రాగానే దాదాపు పదేళ్ళు పార్టీ కోసం కష్టపడిన సోషల్ మీడియా విభాగం వాళ్ళను పార్టీ పెద్దలు గుర్తిస్తారని అందరు అనుకున్నారు. ప్రభుత్వంలో ఏదో ఓ స్ధాయిలో భర్తీ చేసే పదవుల్లో తమను సర్దుబాటు చేస్తారని చాలామంది అనుకున్నారట. అంటే పార్టీ తరపున సర్పంచు, కౌన్సిలర్, ఎంపిటిసి, జడ్పిటీసీ స్ధానాలు లేకపోతే కార్పొరేషన్లలో డైరెక్టర్లగానో అవకాశం కల్పిస్తారని అనుకున్నారట. మరి అలా సర్దుబాటు చేశారో లేదో తెలీదు కానీ చాలామందిలో అసంతృప్తి అయితే మొదలైందన్నది వాస్తవం.

నిజానికి సోషల్ మీడియా తరపున లక్షలమంది పనిచేశారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరినీ పదవుల్లో సర్దుబాటు చేయటం ఎవరికీ సాధ్యంకాదు. కానీ కష్టపడ్డాం కాబట్టి గుర్తింపు కావాలని కోరుకోవటంలో కూడా తప్పులేదు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారట. మరి జగన్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో ? వీరిలో అసంతృప్తి ఎలా తగ్గుతుందో చూడాల్సిందే.

This post was last modified on November 9, 2020 1:46 pm

Share

Recent Posts

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

26 minutes ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

1 hour ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

8 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

8 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

11 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

11 hours ago