Movie News

ఘాటీ వచ్చేస్తోంది…విశ్వంభర సైలెంటుంది

అనుష్క ఘాటీ విడుదల తేదీని రేపు ప్రకటించబోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 11 థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఆ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండొచ్చు. వాస్తవానికి ఏప్రిల్ లో రావాల్సిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వల్ల వాయిదా వేశారు. తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా రిలీజ్ డేట్ రాబోతున్న టైంలోనే ఘాటీ తొందరపడటం చూస్తుంటే రెండూ క్లాష్ కావడమో లేదా అతి తక్కువ గ్యాప్ ఉండటమో జరిగేలా ఉంది. ఇక విశ్వంభరకు ఇక్కడ చెబుతున్న దానికి లింక్ ఏంటో చూద్దాం.

ఘాటీ నిర్మిస్తున్న యువి క్రియేషన్సే విశ్వంభరకు నిర్మాతలు. నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన టీజర్, రామ రామ లిరికల్ సాంగ్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ వదల్లేదు. పోనీ రిలీజ్ డేట్ చెబితే హ్యాపీగా ఫీలవుతామని ఫ్యాన్స్ ఎంతగా కోరుతున్నా అది నెరవేరడం లేదు. ఇంతకు ముందు జూలై 24 అనే ప్రచారం జరిగింది కానీ ఆ సూచనలు తగ్గిపోయాయి. ఆగస్ట్ లో వార్ 2, కూలి, మాస్ జాతరలు కర్చీఫ్ వేసుకున్నాయి. ఇంకో రెండో మూడో జాయినైనా ఆశ్చర్యం లేదు. కానీ విశ్వంభర ఆ నెలలో వస్తే రిస్క్ అవుతుంది. అందుకే జూలై కన్నా బెటర్ ఆప్షన్ ప్రస్తుతానికి లేదు.

ఇప్పుడు ఘాటీది లాక్ చేశారు కాబట్టి విశ్వంభర సెప్టెంబర్ వెళ్లే అవకాశాలు కొట్టి పారేయలేం. సరే ఎంత ఆలస్యమైనా ముందో తేదీని అనుకుని దాన్ని ఫిక్స్ చేసుకుంటే చాలా ఇబ్బందులు తగ్గుతాయి. ఒకపక్క మెగా 157  మొదటి షెడ్యూల్ అప్పుడే అయిపోయింది. దర్శకుడు అనిల్ రావిపూడి జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తున్నారు. కానీ వశిష్ఠ మాత్రం విశ్వంభర విషయంలో ఎలాంటి చొరవ చూపించడం లేదని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవికి సైతం ఎక్కడా దీని గురించి మాట్లాడే సందర్భం రావడం లేదు. ఇంతకీ ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారా అనే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు.

Kumar

Recent Posts

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

24 minutes ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

51 minutes ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

54 minutes ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

1 hour ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

3 hours ago

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

12 hours ago