జూన్ వచ్చేసింది. ఇంకో పన్నెండు రోజుల్లో హరిహర వీరమల్లు విడుదల కానుంది. ఇప్పటిదాకా ట్రైలర్ అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. కనీసం రెండు వారాల ముందు వదిలితే ప్యాన్ ఇండియా బిజినెస్ పరంగా ఉపయోగడుతుందనే వాళ్ళ పాయింట్ కరెక్టే. కానీ నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ బిజీగా ఉండటం వల్ల ఏదైనా అడుగుదామంటే మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. చేతిలో ఉన్నది చాలా అంటే చాలా తక్కువ సమయం. అసలు ఫైనల్ కాపీ చేతికి వచ్చిందో లేదో తెలియదు. సెన్సార్ కోసం ఏ డేట్ అడిగారో క్లారిటీ లేదు. మొత్తానికి సందిగ్దత నెలకొంది.
తెల్లవారుఝామున స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఖాయమైనట్టే. కానీ ఫ్యాన్స్ దాని కన్నా ముందు కోరుకుంటున్నది అమాంతం హైప్ పెరగడం. ఇప్పటిదాకా వచ్చిన పాటలు ఆ పనిని చేయలేదు. ఆస్కార్ విజేత కీరవాణి ఏదో అద్భుతం చేస్తారనుకుంటే యావరేజ్ సాంగ్స్ ఇచ్చారని ఫ్యాన్సే కామెంట్ చేస్తున్నారు. సాలిడ్ ట్రైలర్ ఒకటి పడితే తప్ప ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు. సిజి వర్క్ పూర్తి చేసుకుని తుది కాపీ రేపో ఎల్లుండో వస్తుందని అప్పుడు ట్రైలర్ పనులు కొలిక్కి వస్తాయని ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే మొదటి వారం చివరన ఆశించడం తప్ప ఏం చేయలేం.
బజ్ సంగతి ఎలా ఉన్నా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వర్గాలు హరిహర వీరమల్లు కోసం ఎదురు చూస్తున్నాయి. రోజు మొత్తం షోలన్నీ హౌస్ ఫుల్ చేసే కెపాసిటీ ఉన్న స్టార్ హీరో సినిమాలు వచ్చి వారాలు గడిచిపోయాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంత సునామి దేనికి కనిపించలేదు. హిట్ 3 సైతం మొదటి వీకెండ్ కాగానే నెమ్మదించేసింది. సో హరిహర వీరమల్లు కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్లకు రెండు మూడు వారాలు కళకళలాడతాయని ఎదురు చూస్తున్నారు. సో ఇకపై మెట్రో స్పీడ్ తో దూసుకుపోతేనే వీరమల్లుకు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరుగుతాయి. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on June 1, 2025 6:37 am
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…