లెజెండరీ సెలబ్రిటీలు ఏదైనా పొరపాటుగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా మాట్లాడినా అందులోని అర్థం సరిగా కన్వే కాకపోతే అపార్థంగా మారిపోతుంది. ఇది ఎన్నోసార్లు చూశాం. తాజాగా ఇసైజ్ఞాని ఇళయరాజా ఉదంతం చూస్తే అదే అనిపిస్తుంది. రేపు విడుదల కాబోతున్న షష్ఠిపూర్తికి ఆయన సంగీతం అందించారు. సాధారణంగా ప్రమోషన్ల దూరంగా ఉండే మాస్ట్రో దీనికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా అంత గొప్ప వారు ఎవరూ లేరనే స్థాయిలో ఆయనన్న మాటలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కావాలంటే ఎవరితో అయినా పోల్చి చూడండని చెప్పడం గురించి డిస్కషన్లు జరుగుతున్నాయి.
అసలు ఇంతకీ ఇళయరాజా ఉద్దేశమేంటో అర్థం చేసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కుగ్రామం నుంచి వచ్చి ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండా, ఏ సంగీత దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా పని చేయకుండా, ఇంత స్థాయికి రావడం తన విషయంలో జరిగిందని, ఎంఎస్ విశ్వనాథన్ లాంటి వాళ్ళు సైతం మహామహుల దగ్గర పని చేశాకే తమదైన ముద్ర వేశారని, కానీ నేను మాత్రం అలా కాదని ఇళయరాజా చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన అన్నది ఎవరి చేయూత లేకుండా నేను పైకి వచ్చానని. అలా నా ముందు నా తర్వాత ఎవరూ లేరనేది సారాంశం. కానీ తెలుగులో దాన్ని వ్యక్తపరిచే తీరులో బాష ఇబ్బంది వల్ల మీనింగ్ మారిపోయింది.
ఇదేదో ఇళయరాజాని సమర్ధించే ప్రయత్నం కాదు. ఎవరైనా సరే సపోర్ట్ లేకుండా కూడా కష్టపడి పైకి రావొచ్చనేది ఇళయరాజా చెప్పాలనుకున్న అసలు మాట. గతంలో నేనింకా బెస్ట్ ఇవ్వలేదు, నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ వినయంగా చెప్పుకోవడం ఇలాంటి వేదికల్లోనే చూశాం. ఇప్పుడేదో అహంకారపూరితంగా మాట్లాడతారనుకోవడం సరికాదనేది అభిమానుల అభిప్రాయం. ఒకప్పుడు అద్భుతమైన ఆల్బమ్స్ తో మర్చిపోలేని పాటలు ఇచ్చిన ఇళయరాజా ఇప్పుడా స్థాయిలో కంపోజ్ చేయకపోయినా మంచి సాంగ్స్ అయితే ఇస్తున్నారు. మరి తాజాగా జరిగింది అర్థమో అపార్థమో ప్రేక్షకులే గుర్తించాలి.
This post was last modified on May 29, 2025 11:02 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…