కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బాలీవుడ్లో ప్రకంపనలు రేపిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ రెండు చిత్రాలూ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లు కాగా.. ఈ చిత్రాల మీద విమర్శలు చేసిన అక్కడి క్రిటిక్స్, సినీ జనాలను సందీప్ ఎంత దీటుగా ఎదుర్కొన్నాడో తెలిసిందే. కట్ చేస్తే.. సందీప్ కొత్త చిత్రం ‘స్పిరిట్’ ఇంకా మొదలు కాకముందే బాలీవుడ్ అతణ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈ చిత్రానికి ముందు కథానాయికగా ఎంపికైన దీపికా పదుకునే అనూహ్యంగా తప్పుకుంది. అనేక కండిషన్లు పెట్టడం వల్లే ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశాడని వార్తలొచ్చాయి. ఆమె స్థానంలో ‘యానిమల్’లో ప్రత్యేక పాత్ర చేసిన త్రిప్తి డిమ్రీ కథానాయికగా ఎంపికైంది.
ఐతే అంతటితో కథ ముగియలేదు. బాలీవుడ్ మీడియాలో వరుసగా సందీప్ను టార్గెట్ చేస్తూ కథనాలు మొదలయ్యాయి. ‘ఎ’ రేటెడ్ సీన్లు ఉండడం వల్ల దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ, సందీప్ అన్ ప్రొఫెషనల్ అని.. ఇలాంటి స్టోరీస్ వస్తున్నాయి. ఐతే సందీప్ ఇలాంటి వాటికి బెదిరే రకం కాదు. ఊరుకునే రకం కూడా కాదు. పీఆర్ స్టంట్స్ మొదలుపెట్టిన దీపికకు గట్టిగా కౌంటర్ ఇచ్చేశాడు. సోమవారం అర్ధరాత్రి వేళ ‘ఎక్స్’ ద్వారా దీపిక పేరు ఎత్తకుండానే ఆమె మీద బాంబు వేశాడు సందీప్.
తాను ఒక ఆర్టిస్టుకు కథ చెప్పానంటే అది పూర్తి నమ్మకంతోనే చేస్తానని.. కానీ ఆ కథను బయటపెట్టేయడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటిచెప్పారని సందీప్ వ్యాఖ్యానించాడు. తన కథను బయటపెట్టేయడమే కాక, ఒక యంగ్ యాక్టర్ను తక్కువ చేయడం గురించి ప్రస్తావిస్తూ.. ఇదేనా ఫెమినిజం అని ప్రశ్నించాడు సందీప్. ఒక సినిమా కోసం ఏళ్లు కష్టపడతామని చెబుతూ.. ఫిలిం మేకింగే తనకు అన్నీ అని.. అది ఆ వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదని సందీప్ అన్నాడు. మొత్తం కథను బయటపెట్టేసినా తనకు పోయేదేమీ లేదన్న సందీప్.. ‘డర్టీ పీఆర్ గేమ్స్’ అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా జోడించాడు. ఇది దీపికను ఉద్దేశించిన ట్వీటే అని అందరికీ అర్థమైపోవడంతో ఆమె మీద, బాలీవుడ్ పీఆర్ మాఫియా మీదా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…