ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సినీ రంగంపై చేసిన విమర్శలు సెగలు పొగలు కాదు.. ఏకంగా మంటలు పుట్టిస్తున్నాయి. పవన్ కల్యాణ్ రాసిన ఘాటు, సుదీర్ఘ లేఖపై సినీ పెద్దల స్పందన ఎలా ఉన్నా.. పరిశ్రమలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న కొందరు మాత్రం రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి వారిలో బన్నీ వాసు.. శనివారం రాత్రే పోస్టు చేయగా.. తాజాగా మరో నిర్మాత నాగ వంశీ కూడా రియాక్ట్ అయ్యారు. సినిమా పెద్దల మధ్య ఐక్యత లేదని.. సినీ రంగం ఏం చేస్తోందో కూడా అర్ధంకావడం లేదని ఈ ఇద్దరు పేర్కొన్నారు.
ఇక, తాజాగా మరో నిర్మాత, తరచుగా మీడియా ముందుకు వచ్చే బండ్ల గణేష్ మరింత ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్కు అభిమాని కూడా అయిన ఆయన.. సినీ పెద్దలను ఉద్దేశించి.. “సింహాన్ని కెలకొద్దు!” అని గట్టిగానే చెప్పుకొచ్చారు. ‘సింహాన్ని దూరంగా ఉండి చూడండి తప్పులేదు. దగ్గరికెళ్లి కెలికారా.. ఇక మీ ఇష్టం’ అంటూ పవన్ కళ్యాణ్ ఫోటో జతచేసి పోస్ట్ చేశారు. తాజాగా పవన్ రాసిన లేఖ.. అదే సమయంలో పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందు హాళ్లను బంద్ చేస్తామన్న వ్యాఖ్యలు ఇండిస్ట్రీలో మంటలు రేపాయి.
బండ్ల గణేష్ రాసిన విషయం కూడా.. దాదాపు పవన్ను కెలకొద్దని.. ఆయనతో సర్దుకుపోయే విధంగా పనిచేయాలని కూడా నిర్మాతలు, దర్శకులకు సూచించినట్టు అయింది. పవన్ సింహంలాంటోదని.. ఆయన్ని కెలికితే ఊరుకోరని గణేష్ క్లారిటీ ఇచ్చేశాడు. కాగా.. ఒక్క మాటే గణేష్ పేర్కొన్నా.. పదునైన వ్యాఖ్య కావడంతో ఆయన పోస్టుకు ప్రాధాన్యం ఏర్పడింది.
గతంలోనూ అనేక సందర్భాల్లో పవన్ను సమర్థించిన గణేష్. ఇప్పుడు సినీ రంగానికి చెందిన పెద్దలను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్య చేసినట్టు అయింది. మరోవైపు.. ఇప్పటిదాకా.. సినీ రంగానికి చెందిన పెద్ద నిర్మాతలు.. అల్లు అరవింద్, దిల్ రాజు వంటివారు స్పందించకపోవడం గమనార్హం. మరి వారు ఎప్పటికి రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on May 25, 2025 5:44 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…