వరస హిట్లు లేకపోయినా ప్యాన్ ఇండియా సినిమాలు ఒళ్ళోకొచ్చి పడుతున్న విజయ్ దేవరకొండకు కింగ్ డమ్ మీద చాలా ఆశలున్నాయి. ముందు అనుకున్న ప్రకారం మే 30 విడుదలవుతుందనే ఉద్దేశంతో కొన్ని తమిళ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశాడు. వాటిలో కొన్ని కీలకమైన విషయాలు బయట పడ్డాయి. కింగ్ డమ్ ప్రస్తుతానికి ఒకే భాగమని, కానీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సృష్టించిన ప్రపంచంలో ఎన్నో పాత్రలు, కథలు ఉన్నాయని, ఒకవేళ కొనసాగింపు చేయాల్సి వస్తే నేనే హీరోగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. అంటే కింగ్ డమ్ సింగల్ పార్ట్ కి పరిమితమనే క్లారిటీ వచ్చేసింది.
జెర్సీ చూశాక గౌతమ్ తిన్ననూరి ఎమోషన్లను ఆవిష్కరించిన తీరుకి ఫిదా అయిపోయానని చెబుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ లో ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయని ఊరిస్తున్నాడు. స్టోరీకి సంబంధించిన క్లూస్ ఇవ్వలేదు కానీ తమిళ ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడానికి ఒక కారణముంది. కింగ్ డమ్ శ్రీలంకలో స్థిరపడిన తమిళ శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఇటీవలే సెన్సేషనల్ హిట్ గా నిలిచిన టూరిస్ట్ ఫ్యామిలీలో తీసుకుంది ఈ నేపధ్యమే. కాకపోతే ఇందులో ఫన్నీగా చూపిస్తే కింగ్ డమ్ లో దశాబ్దాల వెనక్కు వెళ్లి చాలా సీరియస్ నెరేషన్ లో ఇంటెన్స్ గా చెప్పబోతున్నారు.
జూలై 4కి వెళ్ళిపోయిన ఈ పీరియడ్ డ్రామాకు అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ పాత్ర హైలైట్స్ లో ముఖ్యమైనవిగా చెబుతున్నారు. డెబ్భై దశకంలో శ్రీలంకలో తీవ్ర అణిచివేతకు గురైన భారతీయల కోసం పోరాడే క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ నుంచి ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ఆశించవచ్చు. ఫైనల్ గా కింగ్ డమ్ ఒక్క భాగమేననే స్పష్టత అయితే వచ్చేసింది. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు కొనసాగింపులో ఎవరితో తీయాలని ప్లాన్ చేస్తారేమో. ఇదయ్యాక సితార సంస్థలోనే గౌతమ్ తిన్ననూరి తీసిన మేజిక్ పనులు ప్రారంభమవుతాయి.
This post was last modified on May 15, 2025 7:10 pm
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…