Movie News

మాయమైన వైవీఎస్.. మళ్లీ వచ్చారు

టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో ఒక దశలో ఆయన ఊపుమీదున్నారు. కానీ ‘ఒక్క మగాడు’ తర్వాత ఆయన కెరీర్ తిరగబడింది. దాంతో మొదలుకుని వరుసగా డిజాస్టర్లు ఇచ్చి అడ్రస్ లేకుండా పోయారు. ‘రేయ్’ తర్వాత చాలా ఏళ్ల పాటు చౌదరి కనిపించలేదు. ఇక మళ్లీ ఆయన ఓ సినిమా చేయడం కష్టమే అనుకున్నారంతా. కానీ గత ఏడాది నందమూరి జానకిరామ్ తనయుడు కొత్త ఎన్టీఆర్‌ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రెండు మూడు నెలల పాటు ఈ సినిమా గురించి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ బాగానే హంగామా చేశారు చౌదరి.

హీరోగా పరిచయమవుతున్న ఎన్టీఆర్‌, హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న వీణారావులకు సంబంధించి ఇంట్రో వీడియోలు ఆకట్టుకున్నాయి. కీరవాణి, చంద్రబోస్, సాయిమాధవ్ బుర్రా లాంటి టాప్ టెక్నీషియన్లను ఈ సినిమాకు ఎంచుకున్నారాయన. ఐతే ఇలా వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ తన రీఎంట్రీ మూవీని వార్తల్లో నిలబెట్టిన చౌదరి.. ఆ తర్వాత ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేదు. షూటింగ్, రిలీజ్ గురించి అప్‌డేట్స్ లేవు. సైలెంటు‌గా షూటింగ్ చేస్తున్నారా అన్న దానిపైనా స్పష్టత లేదు.

దీంతో సినిమా ముందుకు కదులుతుందా.. ఆగిపోతుందా అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఎట్టకేలకు చౌదరి కొత్త అప్‌డేట్‌తో రెడీ అయ్యారు. మే 12న ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఒక విశిష్ఠ అతిథిని తీసుకొస్తున్నారు. సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చాలా ఘనంగా ముహూర్త వేడుకను నిర్వహించబోతున్నారట. ఆ రోజే సినిమాలో హీరో హీరోయిన్ల లుక్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా చూపించబోెతున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను రిలీజ్ చేసేలా షూట్ ప్లాన్ చేస్తున్నారట చౌదరి.

This post was last modified on May 9, 2025 4:08 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YVS Chowdary

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

40 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago