Movie News

సెలబ్రిటీ షోల మీద పెహల్గామ్ ప్రభావం

తలుచుకుంటే చాలు మనసంతా బాధతో నిండిపోయే పెహల్గామ్ దుర్ఘటన తాలూకు విషాదం ఇప్పుడప్పుడే మనల్ని వీడిపోయేలా లేదు. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు నివాళిగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు జనం నుంచి మంచి మద్దతుని తీసుకొస్తున్నాయి. దీని ప్రభావం సెలబ్రిటీల షోల మీద తీవ్రంగా పడుతోంది. యుకెలో మే 4 మరియు 5 తేదీల్లో భారీ లైవ్ కన్సర్ట్ ఒకటి ప్లాన్ చేశారు. టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్, వరుణ్ ధావన్, దిశా పటాని, టైగర్ శ్రోఫ్, కృతి సనన్, సారా అలీ ఖాన్ లాంటి క్రేజీ స్టార్లు ఇందులో పాల్గొంటారని పబ్లిసిటీ చేశారు. లండన్ వేదికగా ఏర్పాట్లు జరిగాయి.

ఒకపక్క పెహల్గామ్ ఉదంతం దేశాన్ని కుదిపేస్తున్న టైంలో వేరే చోట డాన్సులు చేస్తూ, పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయడం సబబు కాదని భావించిన నిర్వాహకులు షోని వాయిదా వేశారు. ఎప్పుడు కొత్త డేట్ అనేది ప్రకటించలేదు కానీ ప్రస్తుతానికి టికెట్లు కొన్న ఆడియన్స్ డబ్బులు వెనక్కు పంపిస్తున్నారు. ఇది మంచి నిర్ణయం. గాయని శ్రేయ ఘోషల్ సైతం తన లైవ్ ప్రోగ్రాంని రద్దు చేసుకోవడం చూశాం. అనిరుధ్ రవిచందర్ తలపెట్టిన హుకుమ్ కార్యక్రమం తాలూకు టికెట్ల అమ్మకాలు పోస్ట్ పోన్ చేశారు. ఆర్జిత్ సింగ్ కూడా ఇదే బాట పట్టారు. ఈ రెండు నెలల్లో తలపెట్టిన ఇలాంటి షోలు క్యాన్సిలయ్యే దిశగా వెళ్తున్నాయి.

బాధితులకు అండగా ఉండాల్సిన ఇలాంటి సమయంలో సంబరాలకు దూరంగా ఉండటం అత్యవసరం. ప్రజల్లో కోపం ఇంకా చల్లారలేదు. సినిమాలు, షోలను ఆస్వాదించే మూడ్ లో పెద్దగా లేరు. అయితే ఈ వాయిదాలు ఎంత కాలం ఉండొచ్చనేది  చెప్పలేం. పాకిస్థాన్ మీద చేపట్టిన చర్యల్లో ఏదో ఒకటి ప్రత్యక్ష ఫలితాన్ని ఇచ్చాక పబ్లిక్ లో ఆగ్రహావేశాలు కొంత మేరకు చల్లారి అప్పుడు సాధారణ వాతావరణం నెలకొనడానికి అవకాశం ఉంటుంది. థియేటర్లలో జనాలు పెద్దగా కనిపించకపోవడానికి కారణం ఇదేనని చెప్పలేం కానీ సోషల్ మీడియాలో పెహల్గామ్ గురించిన చర్చలే ఎక్కువగా జరుగుతూ ఉంటే ఎంటర్ టైన్మెంట్ కు చోటేది.

This post was last modified on April 28, 2025 3:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.…

2 hours ago

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…

2 hours ago

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

3 hours ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

4 hours ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

5 hours ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

6 hours ago