లెజెండరీ నటుడు కమల్ హాసన్ కూతురు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. కొన్నేళ్లకే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది శృతి హాసన్. కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆమె.. ఆ తర్వాత బాగానే నిలదొక్కుకుంది. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. శృతి సినిమాల పరంగానే కాక వ్యక్తిగత విషయాలతోనూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె జీవితంలో ఇప్పటికే రెండు విఫల ప్రేమగాథలున్నాయి. గతంలో మైకేల్ కోర్సాలే అనే యూకే నటుడు, మ్యుజీషియన్తో ఆమె కొన్నేళ్లు రిలేషన్షిప్లో ఉంది.
తర్వాత అతడి నుంచి విడిపోయి కొన్నేళ్లు సింగిల్గా ఉన్న శృతి.. తర్వాత శాంతను అనే విజువల్ ఆర్టిస్ట్తో కొంతకాలం ప్రేమలో ఉంది. ప్రస్తుతం అతడి నుంచి కూడా విడిపోయి సింగిల్ స్టేటస్లోకి వచ్చేసింది. ఐతే తన లవ్ లైఫ్ గురించి జనాలు మాట్లాడుకునే తీరు, అడిగే విధానం తననెంతో బాధిస్తుందని శ్రుతి హాసన్ తెలిపింది. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఉంటాయి. మాజీ భాగస్వామి వల్ల మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. నాక్కూడా బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి. బ్రేకప్ అయ్యాక దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. ఐతే నా లవ్ స్టోరీలను ఉద్దేశించి జనం మాట్లాడే తీరు చిత్రంగా ఉంటుంది.
‘ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్’ అని అడుగుతుంటారు. వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే.. వాళ్లకు అది ఒక నంబర్ మాత్రమే. కానీ నా సంగతి వేరు. నేను కోరుకున్న ప్రేమను పొందడంలో నేను అన్నిసార్లు ఫెయిలయ్యానని అర్థం. అది నన్ను బాధ పెడుతుంది. నేనూ మనిషినే కదా. ఇది ఎందుకు అర్థం చేసుకోరు. నేను బ్రేకప్ తర్వాత ఆ వ్యక్తిని నిందించనని, మనిషి మారడం సహజమే అని.. తాను మాత్రం రిలేషన్షిప్లో నిజాయితీగా ఉండడానికే ప్రయత్నిస్తానని శ్రుతి చెప్పింది. కెరీర్ ఆరంభంలో తాను నటించిన రెండు చిత్రాలు ఫెయిలయ్యాయని.. దీంతో తనపై ఐరెన్ లెగ్ ముద్ర వేశారని.. కానీ ఆ రెండు చిత్రాల్లో హీరోగా చేసిన సిద్ధార్థ్ను ఎవరూ ఏమీ అనలేదని శ్రుతి వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on April 27, 2025 1:08 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…