లెజెండరీ నటుడు కమల్ హాసన్ కూతురు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. కొన్నేళ్లకే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది శృతి హాసన్. కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆమె.. ఆ తర్వాత బాగానే నిలదొక్కుకుంది. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. శృతి సినిమాల పరంగానే కాక వ్యక్తిగత విషయాలతోనూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె జీవితంలో ఇప్పటికే రెండు విఫల ప్రేమగాథలున్నాయి. గతంలో మైకేల్ కోర్సాలే అనే యూకే నటుడు, మ్యుజీషియన్తో ఆమె కొన్నేళ్లు రిలేషన్షిప్లో ఉంది.
తర్వాత అతడి నుంచి విడిపోయి కొన్నేళ్లు సింగిల్గా ఉన్న శృతి.. తర్వాత శాంతను అనే విజువల్ ఆర్టిస్ట్తో కొంతకాలం ప్రేమలో ఉంది. ప్రస్తుతం అతడి నుంచి కూడా విడిపోయి సింగిల్ స్టేటస్లోకి వచ్చేసింది. ఐతే తన లవ్ లైఫ్ గురించి జనాలు మాట్లాడుకునే తీరు, అడిగే విధానం తననెంతో బాధిస్తుందని శ్రుతి హాసన్ తెలిపింది. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఉంటాయి. మాజీ భాగస్వామి వల్ల మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. నాక్కూడా బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి. బ్రేకప్ అయ్యాక దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. ఐతే నా లవ్ స్టోరీలను ఉద్దేశించి జనం మాట్లాడే తీరు చిత్రంగా ఉంటుంది.
‘ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్’ అని అడుగుతుంటారు. వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే.. వాళ్లకు అది ఒక నంబర్ మాత్రమే. కానీ నా సంగతి వేరు. నేను కోరుకున్న ప్రేమను పొందడంలో నేను అన్నిసార్లు ఫెయిలయ్యానని అర్థం. అది నన్ను బాధ పెడుతుంది. నేనూ మనిషినే కదా. ఇది ఎందుకు అర్థం చేసుకోరు. నేను బ్రేకప్ తర్వాత ఆ వ్యక్తిని నిందించనని, మనిషి మారడం సహజమే అని.. తాను మాత్రం రిలేషన్షిప్లో నిజాయితీగా ఉండడానికే ప్రయత్నిస్తానని శ్రుతి చెప్పింది. కెరీర్ ఆరంభంలో తాను నటించిన రెండు చిత్రాలు ఫెయిలయ్యాయని.. దీంతో తనపై ఐరెన్ లెగ్ ముద్ర వేశారని.. కానీ ఆ రెండు చిత్రాల్లో హీరోగా చేసిన సిద్ధార్థ్ను ఎవరూ ఏమీ అనలేదని శ్రుతి వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on April 27, 2025 1:08 pm
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…