కెరీర్ ఆరంభంలో నటించిన సినిమాలను ఆర్టిస్టులు తర్వాత ఎప్పుడో చూసుకుంటే.. అందులో నటన సరిగా లేదని అనిపించడం మామూలే. ఈ మధ్యే సమంత ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. తెలుగులో తన తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ను ఇప్పుడు చూసుకుంటే.. అందులో తాను దారుణంగా నటించినట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించి అభిమానులకు షాకిచ్చింది. సమంత బెస్ట్ పెర్ఫామెన్స్ల్లో ఒకటిగా భావించే ఆ చిత్రంలో తన నటన సమంతకు నచ్చకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా ఇలాంటి కామెంటే చేశాడు.
తనకు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ను ఇప్పుడు చూస్తే తన నటన అంతగా నచ్చలేదని నాని చెప్పాడు. ఈ చిత్రం ఇటీవలే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు నాని కూడా థియేటర్కు వెళ్లి అభిమానుల మధ్య ఆ సినిమ ా చూశాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న సుబ్రహ్మణ్యం పాత్రలో నాని చాలా బాగా నటించాడని అప్పట్లో మంచి పేరొచ్చింది. కానీ నానికి మాత్రం ఇప్పుడు కొన్ని సన్నివేశాలు చూస్తే తాను బాగా నటించలేదని అనిపించిందని తెలిపాడు. ఇక తన కెరీర్లో ‘జెర్సీ’ చాలా స్పెషల్ మూవీ అని చెప్పిన నాని.. ఇప్పుడు తన ఇమేజ్ పెరిగిందని అలాంటి సినిమాలు మానేయడం లాంటిదేమీ ఉండదని చెప్పాడు.
ప్రతి రెండు మూడు సినిమాల తర్వాత ‘జెర్సీ’ లాంటి సినిమా ఒకటి చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు తనకు పెరిగిన రీచ్తో ‘జెర్సీ’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలను మరింతమంది ప్రేక్షకులకు చేరువ చేయాలని కోరుకుంటానని నాని అన్నాడు. తమిళంలో ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రదీప్ రంగనాథన్ గురించి నాని ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ‘లవ్ టుడే’లో తన నటన చూసి ఆశ్చర్యపోయానన్న నాని.. దర్శకుడిగా తన తొలి చిత్రం ‘కోమాలి’ తర్వాత అతను తనకు ఓ కథ చెప్పాడని.. అది బాగున్నా వర్కవుట్ కాలేదని నాని చెప్పాడు.
This post was last modified on April 27, 2025 1:12 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…