కెరీర్ ఆరంభంలో నటించిన సినిమాలను ఆర్టిస్టులు తర్వాత ఎప్పుడో చూసుకుంటే.. అందులో నటన సరిగా లేదని అనిపించడం మామూలే. ఈ మధ్యే సమంత ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. తెలుగులో తన తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ను ఇప్పుడు చూసుకుంటే.. అందులో తాను దారుణంగా నటించినట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించి అభిమానులకు షాకిచ్చింది. సమంత బెస్ట్ పెర్ఫామెన్స్ల్లో ఒకటిగా భావించే ఆ చిత్రంలో తన నటన సమంతకు నచ్చకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా ఇలాంటి కామెంటే చేశాడు.
తనకు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ను ఇప్పుడు చూస్తే తన నటన అంతగా నచ్చలేదని నాని చెప్పాడు. ఈ చిత్రం ఇటీవలే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు నాని కూడా థియేటర్కు వెళ్లి అభిమానుల మధ్య ఆ సినిమ ా చూశాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న సుబ్రహ్మణ్యం పాత్రలో నాని చాలా బాగా నటించాడని అప్పట్లో మంచి పేరొచ్చింది. కానీ నానికి మాత్రం ఇప్పుడు కొన్ని సన్నివేశాలు చూస్తే తాను బాగా నటించలేదని అనిపించిందని తెలిపాడు. ఇక తన కెరీర్లో ‘జెర్సీ’ చాలా స్పెషల్ మూవీ అని చెప్పిన నాని.. ఇప్పుడు తన ఇమేజ్ పెరిగిందని అలాంటి సినిమాలు మానేయడం లాంటిదేమీ ఉండదని చెప్పాడు.
ప్రతి రెండు మూడు సినిమాల తర్వాత ‘జెర్సీ’ లాంటి సినిమా ఒకటి చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు తనకు పెరిగిన రీచ్తో ‘జెర్సీ’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలను మరింతమంది ప్రేక్షకులకు చేరువ చేయాలని కోరుకుంటానని నాని అన్నాడు. తమిళంలో ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రదీప్ రంగనాథన్ గురించి నాని ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ‘లవ్ టుడే’లో తన నటన చూసి ఆశ్చర్యపోయానన్న నాని.. దర్శకుడిగా తన తొలి చిత్రం ‘కోమాలి’ తర్వాత అతను తనకు ఓ కథ చెప్పాడని.. అది బాగున్నా వర్కవుట్ కాలేదని నాని చెప్పాడు.
This post was last modified on April 27, 2025 1:12 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…