విశ్వంభర సంగతేమో కానీ చిరంజీవి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎగ్జైటింగ్ ప్రాజెక్టుల్లో ముందు వరసలో ఉన్న సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలది. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీ కోసం అప్పుడే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ది ప్యారడైజ్ అయ్యేదాకా దీని షూటింగ్ మొదలయ్యే అవకాశం లేనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది కొబ్బరి కాయ కొట్టడం ఖాయమే. ఇదిలా ఉండగా నాని ఇందులో నటించనప్పటికీ ఒక ప్రొడ్యూసర్ గా చాలా పర్సనల్ గా తీసుకుంటున్నాడు. హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్లలో భాగంగా మా ప్రతినిధితో జరిపిన ముఖాముఖీకి దీని గురించి ఓపెనయ్యాడు.
చిన్నప్పటి నుంచి సత్యం థియేటర్ పరిసరాల్లో ఎన్నో చిరంజీవి పోస్టర్లు చూస్తూ పెరిగిన వాడిగా ఆయనంటే ఉన్న ఎనలేని అభిమానం, ఇప్పుడు మెగాస్టార్ మూవీకే నిర్మాతగా పేరు చూసుకుంటే ఒక బయోపిక్ తీస్తున్న ఫీలింగ్ కలుగుతోందని అన్నాడు. అందుకే ఎప్పుడూ దీని గురించే ఆలోచిస్తూ ఒక మర్చిపోలేని గొప్ప అనుభూతిని సినిమా రూపంలో ఇవ్వాలనే తాపత్రయాన్ని వ్యక్తం చేశాడు. ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నానని మరింత ఊరించాడు. దీన్ని బట్టి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ నాని ఫోకస్ మెగా మూవీ మీద ఏ స్థాయిలో ఉందనేది తేటతెల్లం చేస్తోంది. ఇక మొదలవ్వడమే తరువాయి.
హిట్ 3 రిలీజయ్యాక ప్యారడైజ్ సెట్లలో అడుగు పెట్టబోతున్న నాని ఈ సంవత్సరంలో ఇవ్వబోయేది ఒక్క సినిమానే. మొన్నటిదాగా మూడు రిలీజులు ఉండేలా ప్లాన్ చేసుకున్న న్యాచురల్ స్టార్ ఇప్పుడు పెరిగిన ప్యాన్ ఇండియా ఇమేజ్, మార్కెట్ దృష్ట్యా అంత వేగంగా వెళ్లలేకపోతున్నాడు. హిట్ 3 వయొలెన్స్ పరంగా ఇప్పటికే టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారగా అనౌన్స్ మెంట్ టీజర్ తోనే ది ప్యారడైజ్ ఇండియా వైడ్ టాపిక్ అయ్యింది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేసుకోకుండా క్రమంగా మాస్ అండ్ యాక్షన్ వైపు దృష్టి పెడుతున్న నాని వచ్చే సంవత్సరం చిరంజీవికి నిర్మాతగా మరో పెద్ద మెట్టు ఎక్కబోతున్నాడు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…