విశ్వంభర సంగతేమో కానీ చిరంజీవి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎగ్జైటింగ్ ప్రాజెక్టుల్లో ముందు వరసలో ఉన్న సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలది. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీ కోసం అప్పుడే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ది ప్యారడైజ్ అయ్యేదాకా దీని షూటింగ్ మొదలయ్యే అవకాశం లేనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది కొబ్బరి కాయ కొట్టడం ఖాయమే. ఇదిలా ఉండగా నాని ఇందులో నటించనప్పటికీ ఒక ప్రొడ్యూసర్ గా చాలా పర్సనల్ గా తీసుకుంటున్నాడు. హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్లలో భాగంగా మా ప్రతినిధితో జరిపిన ముఖాముఖీకి దీని గురించి ఓపెనయ్యాడు.
చిన్నప్పటి నుంచి సత్యం థియేటర్ పరిసరాల్లో ఎన్నో చిరంజీవి పోస్టర్లు చూస్తూ పెరిగిన వాడిగా ఆయనంటే ఉన్న ఎనలేని అభిమానం, ఇప్పుడు మెగాస్టార్ మూవీకే నిర్మాతగా పేరు చూసుకుంటే ఒక బయోపిక్ తీస్తున్న ఫీలింగ్ కలుగుతోందని అన్నాడు. అందుకే ఎప్పుడూ దీని గురించే ఆలోచిస్తూ ఒక మర్చిపోలేని గొప్ప అనుభూతిని సినిమా రూపంలో ఇవ్వాలనే తాపత్రయాన్ని వ్యక్తం చేశాడు. ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నానని మరింత ఊరించాడు. దీన్ని బట్టి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ నాని ఫోకస్ మెగా మూవీ మీద ఏ స్థాయిలో ఉందనేది తేటతెల్లం చేస్తోంది. ఇక మొదలవ్వడమే తరువాయి.
హిట్ 3 రిలీజయ్యాక ప్యారడైజ్ సెట్లలో అడుగు పెట్టబోతున్న నాని ఈ సంవత్సరంలో ఇవ్వబోయేది ఒక్క సినిమానే. మొన్నటిదాగా మూడు రిలీజులు ఉండేలా ప్లాన్ చేసుకున్న న్యాచురల్ స్టార్ ఇప్పుడు పెరిగిన ప్యాన్ ఇండియా ఇమేజ్, మార్కెట్ దృష్ట్యా అంత వేగంగా వెళ్లలేకపోతున్నాడు. హిట్ 3 వయొలెన్స్ పరంగా ఇప్పటికే టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారగా అనౌన్స్ మెంట్ టీజర్ తోనే ది ప్యారడైజ్ ఇండియా వైడ్ టాపిక్ అయ్యింది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేసుకోకుండా క్రమంగా మాస్ అండ్ యాక్షన్ వైపు దృష్టి పెడుతున్న నాని వచ్చే సంవత్సరం చిరంజీవికి నిర్మాతగా మరో పెద్ద మెట్టు ఎక్కబోతున్నాడు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…