విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న కింగ్ డమ్ విడుదల మే 30 అని గతంలోనే ప్రకటించారు. ఇంకో నలభై రోజులు మాత్రమే ఉండటంతో ఖచ్చితంగా ఆ డేట్ ని అందుకోలేదేమోననే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యాయి. కొందరు ఒక అడుగు ముందుకేసి వాయిదా పక్కా అని ప్రచారం మొదలుపెట్టారు. కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ మాత్రం డెడ్ లైన్ మీటయ్యేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి డబ్బింగ్ పనులు వేగవంతం చేశారు. ఇటీవలే హీరో పార్ట్ మొదలై దాని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
అసలు సమస్య అనిరుధ్ రవిచందర్ తో ఉంది. తనేమో బిజీగా ఉన్నాడు. రీ రికార్డింగ్ కి తగినంత సమయం ఇస్తేనే బెస్ట్ రాబట్టుకోవచ్చు. హడావిడి చేసి ఒత్తిడి తెస్తే అవుట్ ఫుట్ తేడా కొడుతుంది. కమల్ హాసన్ ఇండియన్ 2, అజిత్ పట్టుదల దానికి ఉదాహరణ. అయితే అనిరుధ్ కు కింగ్ డమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో నాని జెర్సీ నుంచే మంచి బాండింగ్ ఉంది. పైగా తెలుగులో సితార సంస్థకు అతనిచ్చే ప్రాధాన్యం ఎక్కువ. ఇది దృష్టిలో పెట్టుకుంటే కనక బీజీఎమ్ కోసం క్వాలిటీ టైం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కింగ్ డమ్ కోసమే గౌతమ్ తిన్ననూరి తన మరో సినిమా మేజిక్ పోస్ట్ ప్రొడక్షన్ ఆపేశాడు.
సో కింగ్ డమ్ మాట మీద ఉంటేనే మంచిది. ఎందుకంటే జూన్ లో కుబేర, కన్నప్ప లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు కనక మేలో రాకపోతే అది కూడా జూన్ కు వెళ్తుంది. అప్పుడు ఓపెనింగ్స్ పరంగా కింగ్ డమ్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలను కొట్టిపారేయలేం. పైగా అన్ని భాషల్లో విడుదల కాబట్టి సోలో డేట్ కోసం చాలా కసరత్తు చేసి మే 30 లాక్ చేసుకున్నారు. వదులుకుంటే చిక్కులు తప్పవు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రమోషన్ల కోసం ఓ రెండు వారాలు కేటాయించుకోవాలి. సో కింగ్ డమ్ టీమ్ కాళ్లకు చక్రాలు కాదు రాకెట్లు తగిలించుకుని మరీ పరుగులు పెట్టాల్సి ఉంటుంది.
This post was last modified on April 20, 2025 8:41 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…