బాలీవుడ్లో ప్రతి హీరోయిన్ కచ్చితంగా సినిమా చేయాలని ఆశించే హీరోల్లో హృతిక్ రోషన్ ఒకడు. అలాగే ఎవరి దర్శకత్వంలో నటించాలనుకుంటున్నారని అడిగితే చెప్పే పేర్లలో అశుతోష్ గోవారికర్ ఒకడు. ఇలాంటి హీరో, దర్శకుడితో కలిసి తొలి సినిమాకే పని చేసే అవకాశం వస్తే అంత కంటే అదృష్టం ఉంటుందా? ఆ అదృష్టం పూజా హెగ్డేను వరించింది కొన్నేళ్ల కిందట.
అప్పటికే తమిళంలో ‘మాస్క్’.. తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల్లో నటించిన పూజాకు బాలీవుడ్లో హృతిక్, అశుతోష్లతో కలిసి ‘మొహెంజదారో’ లాంటి మెగా మూవీతో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. దక్షిణాదిన అవకాశాలన్నీ వదులుకుని రెండేళ్ల పాటు ఈ సినిమాకే అంకితమైంది పూజా. తీరా చూస్తే ఈ సినిమా డిజాస్టర్ అయింది. పూజా హెగ్డేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఈ సినిమా ఫలితం తన గుండె పగిలేలా చేసిందంటూ ఇప్పుడు వాపోయింది పూజా. ఎవరికైనా సరే తొలి సినిమా ఎంతో కీలకమైందని. ఎన్నో ఆశలు పెట్టుకుంటామని.. ఐతే హిందీలో తన తొలి చిత్రం ‘మొహెంజదారో’ పరాజయం పాలవడం తనను తీవ్రంగా బాధించిందని పూజా వ్యాఖ్యానించింది. ఐతే ఆ బాధ నుంచి కోలుకునేలా చేసింది తెలుగు సినిమాలే అని.. ఇక్కడ తన సినిమాలు విజయవంతం కావడంతో ధైర్యంగా ముందుకు సాగానని పూజా చెప్పింది.
మొదటి సినిమా ఫెయిలవడం వల్లే హిందీలో రెండో సినిమాకు సంతకం చేసేందుకు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని.. ఐతే అక్కడ తన తర్వాతి సినిమా ‘హౌస్ ఫుల్-4’ విజయవంతం కావడంతో ఇప్పుడు బాలీవుడ్ కెరీర్ మీద కూడా దృష్టిసారించానని పూజా చెప్పింది. త్వరలోనే ఆమె హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి రూపొందించనున్న ‘సర్కస్’లో నటించనుంది. సల్మాన్ ఖాన్ సరసన కూడా ఆమె నటించే అవకాశాలున్నాయి. తెలుగులో ప్రస్తుతం పూజా.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 2, 2020 3:30 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…