పోటీ లేకుండా సోలో రిలీజ్ దక్కితేనే ప్యాన్ ఇండియా సినిమాలకు మంచి ఓపెనింగ్స్ తో పాటు క్లోజింగ్ ఫిగర్స్ బాగుంటాయి. అందుకే బాగా ఆలస్యమైనా సరే కుబేరకు జూన్ 20 లాక్ చేసుకున్నారు. ధనుష్, రష్మిక మందన్న జంటగా నాగార్జున ఒక కీలక పాత్ర పోషించిన ఈ మనీ క్రైమ్ డ్రామాను దర్శకుడు శేఖర్ కమ్ముల అనుకున్న సమయం కంటే చాలా ఎక్కువ తీసుకున్నప్పటికీ క్వాలిటీ విషయం అస్సలు రాజీ పడలేదని ఇన్ సైడ్ టాక్. అందుకే రెండు నెలల ముందే ప్రమోషన్లు మొదలుపెట్టి ఫస్ట్ ఆడియో సింగల్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన మొదటి పాట ప్రోమో ఇప్పటికే అంచనాలు పెంచింది.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ కుబేర వస్తున్న జూన్ 20నే అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ విడుదలకు ప్లానింగ్ జరుగుతోందనే వార్త అక్కినేని ఫ్యాన్స్ లో టెన్షన్ పుట్టిస్తోంది. ఎందుకంటే తెలుగు వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా హిందీ వెర్షన్ వల్ల మల్టీప్లెక్సుల కలెక్షన్లు ప్రభావితం చెందుతాయి. పైగా దీని మీద ప్రీ బజ్ చాలా పాజిటివ్ గా ఉంది. అజయ్ దేవగన్ రైడ్ 2 తో పాటు థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. అమీర్ ఖాన్ స్వీయ నిర్మాణంలో ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన సితారే జమీన్ పర్ కమర్షియల్ మూవీ కాకపోయినా కంటెంట్ పరంగా క్లాసు మాసు కనెక్ట్ అయ్యే అంశాలు బోలెడున్నాయి.
మరి ఈ క్లాష్ నిజంగా జరగనుండగా లేదానేది ఇంకో వారం రోజుల్లో తేలనుంది. నాగార్జునతో వ్యక్తిగతంగా ఎంత మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నా అమీర్ ఖాన్ ఈ ముఖాముఖీని ఆపడు. ఎందుకంటే గతంలో గదర్ కు పోటీగా లగాన్, ఘాయల్ కు కాంపిటీషన్ గా దిల్ ని దింపి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. పోటీలో ఉన్నవి కూడా సూపర్ హిట్ కావడం వేరే విషయం. ఒక బిచ్చగాడు కోట్లకు పడగెత్తే క్రమాన్ని ఒక డిఫరెంట్ సెటప్ లో చూపించబోతున్న శేఖర్ కమ్ముల కుబేరతో ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయమే అనిపిస్తోంది. దేవి కంపోజ్ చేసిన పాటలు చాలా బాగా వచ్చాయని తెలిసింది. కమ్ముల అభిరుచి తెలిసిందేగా.
This post was last modified on April 17, 2025 7:59 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…