అరడజను ఫ్లాపుల తర్వాత గత ఏడాదే ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలతో పుంజుకున్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఇటీవలే అతడి కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ పూర్తయింది. అది త్వరలోనే విడుదల కాబోతోంది. దీని తర్వాత తేజు రెండు మూడు కమిట్మెంట్లు ఇచ్చాడు. అందులో ఒకటి ఆల్రెడీ చిత్రీకరణ కూడా మొదలుపెట్టుకుంది.
‘ప్రస్థానం’తో గొప్ప పేరు సంపాదించి ఆ తర్వాత వరుస పరాజయాలు చవిచూసిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు కథానాయికగా ముందు నివేథా పెతురాజ్ను ఎంచుకున్నారు. ఆమె ఇంతకుముందు ‘చిత్రలహరి’లో తేజు పక్కన నటించి మెప్పించింది. హిట్ పెయిర్ను రిపీట్ చేద్దామనుకున్నారో, పాత్రకు ఆమే కరెక్ట్ అనుకున్నారో కానీ.. తననే ఖరారు చేశారు.
కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి నివేథా తప్పుకున్నట్లు సమాచారం. డేట్ల సమస్య వల్లే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. తెలుగులో కెరీర్ నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో మంచి అంచనాలున్న ఈ సినిమాను నివేథా వదులుకోవాల్సి రావడం విచారకరమే. ఆమె స్థానంలోకి కోలీవుడ్లో స్టార్గా ఎదిగిన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ రాబోతున్నట్లు తెలుస్తోంది. నటిగా ఐశ్వర్యకు మంచి పేరుంది కానీ.. గ్లామర్ విషయంలో ఆమెది వెనుకంజే.
తెలుగులో ఆమె ఇప్పటిదాకా చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలు అందించలేదు. మరి తేజు సరసన ఆమె ఎలా మెరుస్తుందో చూడాలి. దేవా శైలి ప్రకారం చూస్తే ఇందులో కథానాయిక పాత్రకు బాగానే ప్రాధాన్యం ఉండొచ్చు. ఈసారి హిట్టు కొట్టి తీరాల్సిన స్థితిలో ఉన్న దేవా.. తేజు కోసం ఒక పొలిటికల్ థ్రిల్లర్ ట్రై చేస్తున్నాడు. ‘ప్రస్థానం’లో రాజకీయ అంశాల్ని అతను భలేగా డీల్ చేశాడు. ఈ చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
This post was last modified on November 1, 2020 6:33 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…