అరడజను ఫ్లాపుల తర్వాత గత ఏడాదే ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలతో పుంజుకున్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఇటీవలే అతడి కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ పూర్తయింది. అది త్వరలోనే విడుదల కాబోతోంది. దీని తర్వాత తేజు రెండు మూడు కమిట్మెంట్లు ఇచ్చాడు. అందులో ఒకటి ఆల్రెడీ చిత్రీకరణ కూడా మొదలుపెట్టుకుంది.
‘ప్రస్థానం’తో గొప్ప పేరు సంపాదించి ఆ తర్వాత వరుస పరాజయాలు చవిచూసిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు కథానాయికగా ముందు నివేథా పెతురాజ్ను ఎంచుకున్నారు. ఆమె ఇంతకుముందు ‘చిత్రలహరి’లో తేజు పక్కన నటించి మెప్పించింది. హిట్ పెయిర్ను రిపీట్ చేద్దామనుకున్నారో, పాత్రకు ఆమే కరెక్ట్ అనుకున్నారో కానీ.. తననే ఖరారు చేశారు.
కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి నివేథా తప్పుకున్నట్లు సమాచారం. డేట్ల సమస్య వల్లే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. తెలుగులో కెరీర్ నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో మంచి అంచనాలున్న ఈ సినిమాను నివేథా వదులుకోవాల్సి రావడం విచారకరమే. ఆమె స్థానంలోకి కోలీవుడ్లో స్టార్గా ఎదిగిన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ రాబోతున్నట్లు తెలుస్తోంది. నటిగా ఐశ్వర్యకు మంచి పేరుంది కానీ.. గ్లామర్ విషయంలో ఆమెది వెనుకంజే.
తెలుగులో ఆమె ఇప్పటిదాకా చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలు అందించలేదు. మరి తేజు సరసన ఆమె ఎలా మెరుస్తుందో చూడాలి. దేవా శైలి ప్రకారం చూస్తే ఇందులో కథానాయిక పాత్రకు బాగానే ప్రాధాన్యం ఉండొచ్చు. ఈసారి హిట్టు కొట్టి తీరాల్సిన స్థితిలో ఉన్న దేవా.. తేజు కోసం ఒక పొలిటికల్ థ్రిల్లర్ ట్రై చేస్తున్నాడు. ‘ప్రస్థానం’లో రాజకీయ అంశాల్ని అతను భలేగా డీల్ చేశాడు. ఈ చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…