ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్ వేగంగా పూర్తి చేసేందుకు ఆయా దర్శకులకు సూచనలు వెళ్లినట్టు ఫిలింనగర్ టాక్. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ రెండూ కంప్లీట్ అయితే తర్వాత సందీప్ రెడ్డి వంగా సూచనల మేరకు కేవలం స్పిరిట్ మూవీకే డార్లింగ్ అంకితం కాబోతున్నట్టు తెలిసింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్క్రిప్ట్ పనులు దాదాపు కొలిక్కి వచ్చేశాయి. సందీప్ సాధారణంగా తీసుకునే సమయం కంటే స్పిరిట్ ఎక్కుడ డిమాండ్ చేసిందట. ప్రతిదీ పెర్ఫెక్ట్ అనిపించుకున్నాకే ఫైనల్ చేయడం అతని శైలి కాబట్టి ఇందులో ఆశ్చర్యం లేదు.
ప్రాధమికంగా అందుతున్న సమాచారం మేరకు స్పిరిట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. దీని కోసమే ప్రభాస్ ప్రత్యేకంగా బరువు తగ్గి ఫిజిక్ ని మార్చుకోబోతున్నాడు. రూత్ లెస్ (జాలి దయ లేని) పోలీస్ ఆఫీసర్ పాత్ర కాబట్టి దానికి తగ్గ శరీరాకృతిని మలుచుకోబోతున్నట్టు చెబుతున్నారు. యుఎస్, కొరియా నుంచి ఎంపిక చేసిన యాక్టర్లు ఇందులో భాగం కాబోతున్నారు. విలన్ గా డాన్లీ పేరు వినిపిస్తోంది కానీ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. దీన్ని కేవలం ఇండియాలో మాత్రమే షూట్ చేయట్లేదు. వివిధ దేశాల్లో చిత్రీకరణ ఉంటుందని, ఊహించని మలుపులు అక్కడే ఉంటాయని అంటున్నారు.
2027 విడుదల టార్గెట్ గా పెట్టుకున్న సందీప్ రెడ్డి వంగా ఒక ఏడాది పూర్తిగా షూట్ కే కేటాయించబోతున్నాడు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం తగినంత సమయం ఉంటుంది. యానిమల్ తర్వాత మూవీ కావడంతో బాలీవుడ్ సర్కిల్స్ లో దీని మీద విపరీతమైన డిమాండ్ ఉంది. నిర్మాణ సంస్థలు టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కి అప్పుడే ఆఫర్ల వర్షం మొదలయ్యిందట. ఓటిటి ఎంక్వయిరీలు సైతం కళ్ళు చెదిరే ఆఫర్లు ఇస్తున్నాయని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా ఇవేవి ఫైనల్ చేసే మూడ్ లో లేడు. షూట్ మొదలయ్యాక ప్రోగ్రెస్ ని బట్టి ఎంత రేట్లు ఉండాలనేది డిసైడ్ చేయబోతున్నారట. సో లాంగ్ వెయిటింగ్ తప్పదు.
This post was last modified on April 12, 2025 6:47 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…