చెప్పిన డేటుకి వస్తుందా రాదా అనే ప్రశ్నతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరట కలిగిస్తూ హరిహర వీరమల్లు మే 9 విడుదలవుతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ రిలీఫ్ ఫీలవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్ వేగంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఆలస్యం ఉండదని మెగా సూర్య ప్రొడక్షన్స్ చెప్పడం చూస్తే నమ్మేలానే ఉంది. అయితే చేతిలో ఉన్న ఇరవై ఎనిమిది రోజులు నిర్మాత ఏఎం రత్నం బృందం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఇంకా సరైన స్థాయిలో ప్రమోషన్లు జరగడం లేదు. పబ్లిసిటీ గేరు అర్జెంట్ గా మార్చేయాలి.
ఇది మొదటి భాగమే కనక బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. అప్పుడే సీక్వెల్ కి హైప్ వస్తుంది. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్ కు ముందు దర్శకుడు క్రిష్ పనిచేయగా ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతికృష్ణ తీసుకున్నాడు. ఇద్దరికీ క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ఔరంజేబుగా బాబీ డియోల్ ఒక ముఖ్య భూమిక పోషించాడు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజ్ తదితరులతో పెద్ద క్యాస్టింగే ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీదకు వెళ్తున్నాయి.
నార్త్ బాలీవుడ్ సర్కిల్స్ లో వసూళ్లు రావాలంటే ఆ బరువంతా ట్రైలర్ మీదే ఉంటుంది. ఛావా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగింది. సహజంగానే ప్రేక్షకులకు వీరమల్లు మీదకు దృష్టి వెళ్తుంది. దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు గట్రా చేయాలి. వ్యక్తిగతంగా రాజకీయంగా పవన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారంలో ఎంతమేరకు భాగమవుతారో చూడాలి. ముందు ఓజి జపంలో మునిగి తేలే అభిమానులను వీరమల్లు వైపు లాగాలి. సోషల్ మీడియాలో వాళ్లే పబ్లిసిటీకి మొదటి మెట్టు. ఆ తర్వాతే మిగిలినవి.
This post was last modified on April 11, 2025 12:39 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…