చెప్పిన డేటుకి వస్తుందా రాదా అనే ప్రశ్నతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరట కలిగిస్తూ హరిహర వీరమల్లు మే 9 విడుదలవుతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ రిలీఫ్ ఫీలవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్ వేగంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఆలస్యం ఉండదని మెగా సూర్య ప్రొడక్షన్స్ చెప్పడం చూస్తే నమ్మేలానే ఉంది. అయితే చేతిలో ఉన్న ఇరవై ఎనిమిది రోజులు నిర్మాత ఏఎం రత్నం బృందం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఇంకా సరైన స్థాయిలో ప్రమోషన్లు జరగడం లేదు. పబ్లిసిటీ గేరు అర్జెంట్ గా మార్చేయాలి.
ఇది మొదటి భాగమే కనక బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. అప్పుడే సీక్వెల్ కి హైప్ వస్తుంది. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్ కు ముందు దర్శకుడు క్రిష్ పనిచేయగా ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతికృష్ణ తీసుకున్నాడు. ఇద్దరికీ క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ఔరంజేబుగా బాబీ డియోల్ ఒక ముఖ్య భూమిక పోషించాడు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజ్ తదితరులతో పెద్ద క్యాస్టింగే ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీదకు వెళ్తున్నాయి.
నార్త్ బాలీవుడ్ సర్కిల్స్ లో వసూళ్లు రావాలంటే ఆ బరువంతా ట్రైలర్ మీదే ఉంటుంది. ఛావా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగింది. సహజంగానే ప్రేక్షకులకు వీరమల్లు మీదకు దృష్టి వెళ్తుంది. దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు గట్రా చేయాలి. వ్యక్తిగతంగా రాజకీయంగా పవన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారంలో ఎంతమేరకు భాగమవుతారో చూడాలి. ముందు ఓజి జపంలో మునిగి తేలే అభిమానులను వీరమల్లు వైపు లాగాలి. సోషల్ మీడియాలో వాళ్లే పబ్లిసిటీకి మొదటి మెట్టు. ఆ తర్వాతే మిగిలినవి.
This post was last modified on April 11, 2025 12:39 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…