చెప్పిన డేటుకి వస్తుందా రాదా అనే ప్రశ్నతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరట కలిగిస్తూ హరిహర వీరమల్లు మే 9 విడుదలవుతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ రిలీఫ్ ఫీలవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్ వేగంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఆలస్యం ఉండదని మెగా సూర్య ప్రొడక్షన్స్ చెప్పడం చూస్తే నమ్మేలానే ఉంది. అయితే చేతిలో ఉన్న ఇరవై ఎనిమిది రోజులు నిర్మాత ఏఎం రత్నం బృందం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఇంకా సరైన స్థాయిలో ప్రమోషన్లు జరగడం లేదు. పబ్లిసిటీ గేరు అర్జెంట్ గా మార్చేయాలి.
ఇది మొదటి భాగమే కనక బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. అప్పుడే సీక్వెల్ కి హైప్ వస్తుంది. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్ కు ముందు దర్శకుడు క్రిష్ పనిచేయగా ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతికృష్ణ తీసుకున్నాడు. ఇద్దరికీ క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ఔరంజేబుగా బాబీ డియోల్ ఒక ముఖ్య భూమిక పోషించాడు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజ్ తదితరులతో పెద్ద క్యాస్టింగే ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీదకు వెళ్తున్నాయి.
నార్త్ బాలీవుడ్ సర్కిల్స్ లో వసూళ్లు రావాలంటే ఆ బరువంతా ట్రైలర్ మీదే ఉంటుంది. ఛావా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగింది. సహజంగానే ప్రేక్షకులకు వీరమల్లు మీదకు దృష్టి వెళ్తుంది. దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు గట్రా చేయాలి. వ్యక్తిగతంగా రాజకీయంగా పవన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారంలో ఎంతమేరకు భాగమవుతారో చూడాలి. ముందు ఓజి జపంలో మునిగి తేలే అభిమానులను వీరమల్లు వైపు లాగాలి. సోషల్ మీడియాలో వాళ్లే పబ్లిసిటీకి మొదటి మెట్టు. ఆ తర్వాతే మిగిలినవి.
This post was last modified on April 11, 2025 12:39 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…