బాహుబలి తర్వాత తనకు ఎంతటి ఇమేజ్ వస్తుందనేది ప్రభాస్ ముందే అంచనా వేయలేకపోయాడు. ఒకవేళ వేసినట్టయితే ఖచ్చితంగా తన తదుపరి రెండు చిత్రాలను అనుభవం లేని యువ దర్శకులతో ప్లాన్ చేసుకుని వుండేవాడు కాదు. బాహుబలి హిట్టయ్యాక తన మాట మార్చుకుని వుండొచ్చు కానీ తనకోసం అంతకాలం ఎదురు చూసిన దర్శకులను చిన్నబుచ్చలేక ఆ మాటకు కట్టుబడిపోయాడు.
సాహోతో సుజీత్ చాలా తడబడ్డాడు. ప్రభాస్కి వున్న శిఖరమంతటి ఇమేజ్కి తగ్గ సినిమా తీయలేక చతికిలపడ్డాడు. అతనితో పాటే రాధాకృష్ణ కుమార్కి కూడా మాట ఇచ్చిన ప్రభాస్ ఇంకా ‘రాధే శ్యామ్’ పూర్తి చేయలేకపోయాడు. కరోనా బ్రేక్ తర్వాత షూటింగ్ సజావుగా సాగుతుందని అనుకుంటే మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ చేయలేని పరిస్థితి వుండడంతో ఈ చిత్రాన్ని ముందుకెలా తీసుకెళ్లాలా అని నిర్మాతలు వర్రీ అవుతున్నారు.
ఎక్స్టీరియర్ షాట్స్ అన్నీ తీసేసుకుని వచ్చి మిగతాది ఇక్కడే సెట్స్లో చేద్దామని అనుకున్నారు కానీ అంతవరకు కూడా షూట్ చేయలేకపోయారు. బాహుబలి తర్వాత ఇద్దరు యువ దర్శకులతో సినిమాలు చేయాలనే ప్రభాస్ నిర్ణయం ఇప్పుడు తన ఫ్యూచర్ ప్లాన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తోంది. రాధేశ్యామ్ ఆలస్యం అయ్యేకొద్దీ ఆది పురుష్తో పాటు నాగ్ అశ్విన్ సినిమా కూడా మరింత వెనక్కి వెళుతుంది.
This post was last modified on November 2, 2020 10:25 pm
దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం…
అవును.. దళపతి విజయ్ ఏడ్చేశాడు. అవేమీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు కావు. తన…
అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…
భాగ్యనగరం హైదరాబాద్లో మహిళల దుస్థితి ఎలా ఉందో.. ఒంటరి మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేసిన…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ…