మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం అంత సులభంగా మర్చిపోయేది కాదు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ గా రూపొందిన ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామా అవసరం లేని మార్పులకు లోనై తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరీ వరస్ట్ మూవీ కాకపోయినా కంటెంట్ మీద అంచనాలు ఎక్కువగా ఉండటంతో అంత బరువు మోయలేక చతికిల బడింది. ఫలితం ఎలా ఉన్నా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జనాల దృష్టిలో పడటం, వరసగా టయర్ 2 స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కడం వేరే విషయం.
తాజాగా రైడ్ 2 వస్తోంది. వచ్చే నెల మే 1 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. వీడియో కట్ ఆసక్తికరంగా ఉంది. ఈసారి విలన్ గా రితేష్ దేశముఖ్ (బొమ్మరిల్లు జెనీలియా భర్త) నటించాడు. ఆదాయపు పన్ను శాఖ దాడినే మెయిన్ పాయింట్ గా తీసుకున్నప్పటికీ గ్రాండియర్ నెస్ పెరిగింది. మొదటి భాగంలో హీరో అజయ్ దేవగన్ భార్యగా నటించిన ఇలియానా స్థానంలో వాణి కపూర్ వచ్చి చేరింది. రైడ్ ప్రతినాయకుడు సౌరభ్ శుక్లా తిరిగి రైడ్ 2లోనూ కనిపించడం విశేషం. రెండు సినిమాల మధ్య ఇంటర్ లింక్స్ బాగా కుదిరాయి. ఒకవేళ మిస్టర్ బచ్చన్ హిట్టయ్యుంటే మనకూ సీక్వెల్ వచ్చేది.
దీని సంగతలా ఉంచితే రైడ్ 2 మన నాని హిట్ 3 ది థర్డ్ కేస్ కి ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన పోటీ ఇవ్వనుంది. ఇంకోవైపు సూర్య రెట్రో తమిళనాడు, కేరళలో ప్రభావితం చేయనుంది. నార్త్ ట్రేడ్ లో రైడ్ 2 మీద భారీ అంచనాలున్నాయి. గత కొంత కాలంగా డ్రైగా ఉన్న థియేటర్లకు అజయ్ దేవగన్ జనాన్ని తీసుకొస్తాడని నమ్ముతున్నారు. సికందర్ ఘోరంగా బోల్తా కొట్టిన నేపథ్యంలో అక్కడి బిజినెస్ కి రైడ్ 2 హిట్ కావడం చాలా కీలకం. అందుకే పెద్ద ఎత్తున థియేటర్ కేటాయింపులు జరగనున్నాయి. టి సిరీస్ నిర్మాణం కనక డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పనక్కర్లేదు. దీనికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు.
This post was last modified on April 8, 2025 4:38 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…