ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ది ప్యారడైజ్, పెద్దిలు క్లాష్ కానుండటం ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. మార్చ్ 26 నాని, మార్చ్ 27 రామ్ చరణ్ రావడం కన్ఫర్మ్ అయ్యింది. అయితే పైకి కనిపిస్తున్నంత తేలిగ్గా ఈ హోరాహోరీ జరగదు. అదెలాగో చూద్దాం. మొదటి పాయింట్ రెండు ప్యాన్ ఇండియా బడ్జెట్లే. ముఖ్యంగా నాని కెరీర్ లోనే అత్యధిక మొత్తం ప్యారడైజ్ మీద ఖర్చు పెడుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. పెద్ద ఎత్తున వేసిన సెట్లు సిద్ధంగా ఉన్నాయి. స్క్రిప్ట్ లాక్ చేసుకోవడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక కొలిక్కి తెచ్చేశాడు.
ఇక పెద్ది విషయానికి వస్తే బుచ్చిబాబు అనుకున్న దానికన్నా వేగంగా తీస్తున్నాడు. శివరాజ్ కుమార్ లాంటి కీలక ఆర్టిస్టుల డేట్లు మళ్ళీ మళ్ళీ దొరికేవి కాకపోవడంతో ముందు ఆ ఎపిసోడ్లన్నీ కానిస్తున్నాడు. రెహమాన్ తో మూడు పాటలు ఓకే అయ్యాయి. మిగిలినవి కూడా రెడీ అవుతాయి. జాన్వీ కపూర్ అవసరం పడినప్పుడంతా కాల్ షీట్లు ఇచ్చి సహకరిస్తోంది. సో పెద్దికి బ్రేక్ పడేలా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్యారడైజ్ తో పోల్చుకుంటే పెద్ది చిత్రీకరణ రెండు మూడడుగులు ముందే ఉంది. అలాని సమస్య లేదని కాదు. స్టార్ హీరోల సినిమాలకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఇక్కడ ఇంకో కోణం ఉంది.
మార్కెట్, బిజినెస్ పరంగా చరణ్ తో నాని సమానం కాదు. అయినా సరే కంటెంట్ తో తలపడాలన్నా థియేటర్ల పరంగా ఇబ్బందులు వస్తాయి. ఇది కాకుండా నాని నిర్మాతగా ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ బాండింగ్ దృష్ట్యా పెద్దిని కవ్వించడం ప్యారడైజ్ కు ఇబ్బందే. ముందు అనౌన్స్ చేసింది మేమే కదాని నాని అభిమానులు అనొచ్చు. అది నిజమే. కానీ ప్రాక్టికల్ కోణంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్మాతలు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. సో పేపర్ మీద నాని వర్సెస్ చరణ్ కనిపిస్తోంది కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో తరహాలో దేనికైనా వేచి చూడాల్సిందే.
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…