ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ది ప్యారడైజ్, పెద్దిలు క్లాష్ కానుండటం ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. మార్చ్ 26 నాని, మార్చ్ 27 రామ్ చరణ్ రావడం కన్ఫర్మ్ అయ్యింది. అయితే పైకి కనిపిస్తున్నంత తేలిగ్గా ఈ హోరాహోరీ జరగదు. అదెలాగో చూద్దాం. మొదటి పాయింట్ రెండు ప్యాన్ ఇండియా బడ్జెట్లే. ముఖ్యంగా నాని కెరీర్ లోనే అత్యధిక మొత్తం ప్యారడైజ్ మీద ఖర్చు పెడుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. పెద్ద ఎత్తున వేసిన సెట్లు సిద్ధంగా ఉన్నాయి. స్క్రిప్ట్ లాక్ చేసుకోవడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక కొలిక్కి తెచ్చేశాడు.
ఇక పెద్ది విషయానికి వస్తే బుచ్చిబాబు అనుకున్న దానికన్నా వేగంగా తీస్తున్నాడు. శివరాజ్ కుమార్ లాంటి కీలక ఆర్టిస్టుల డేట్లు మళ్ళీ మళ్ళీ దొరికేవి కాకపోవడంతో ముందు ఆ ఎపిసోడ్లన్నీ కానిస్తున్నాడు. రెహమాన్ తో మూడు పాటలు ఓకే అయ్యాయి. మిగిలినవి కూడా రెడీ అవుతాయి. జాన్వీ కపూర్ అవసరం పడినప్పుడంతా కాల్ షీట్లు ఇచ్చి సహకరిస్తోంది. సో పెద్దికి బ్రేక్ పడేలా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్యారడైజ్ తో పోల్చుకుంటే పెద్ది చిత్రీకరణ రెండు మూడడుగులు ముందే ఉంది. అలాని సమస్య లేదని కాదు. స్టార్ హీరోల సినిమాలకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఇక్కడ ఇంకో కోణం ఉంది.
మార్కెట్, బిజినెస్ పరంగా చరణ్ తో నాని సమానం కాదు. అయినా సరే కంటెంట్ తో తలపడాలన్నా థియేటర్ల పరంగా ఇబ్బందులు వస్తాయి. ఇది కాకుండా నాని నిర్మాతగా ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ బాండింగ్ దృష్ట్యా పెద్దిని కవ్వించడం ప్యారడైజ్ కు ఇబ్బందే. ముందు అనౌన్స్ చేసింది మేమే కదాని నాని అభిమానులు అనొచ్చు. అది నిజమే. కానీ ప్రాక్టికల్ కోణంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్మాతలు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. సో పేపర్ మీద నాని వర్సెస్ చరణ్ కనిపిస్తోంది కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో తరహాలో దేనికైనా వేచి చూడాల్సిందే.
This post was last modified on April 6, 2025 5:33 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…