ఒక చిన్న టీజర్ కోసం ఫ్యాన్స్ ఇంతగా ఎదురు చూడటం మెగా ఫ్యాన్స్ కు పెద్ది విషయంలోనే జరిగింది. కొత్త జంటతో ఉప్పెన బ్లాక్ బస్టర్ తో పాటు జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు బుచ్చిబాబు మీద అభిమానులు అంతులేని నమ్మకం పెట్టుకున్నారు. సుకుమార్ శిష్యుడు కావడంతో గురువు సహకారం, మార్గదర్శకత్వంలో రంగస్థలంని మించిన బొమ్మ ఇస్తాడని సోషల్ మీడియాలో తెగ ఎలివేషన్లు ఇస్తూ వచ్చారు. అనుకున్నట్టుగా పెద్ది టీజర్ తో బుచ్చిబాబు ధోని స్టైల్ లో హెలికాఫ్టర్ షాట్ కొట్టాడు. కథేమీ చెప్పకపోయినా రామ్ చరణ్ ని ప్రేక్షకులు ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే ప్రెజెంట్ చేశాడు.
రంగస్థలం తరహా పల్లెటూరి వాతావరణం, దసరా టైపులో క్రికెట్ ఆట లాంటి కొన్ని పోలికలు కనిపిస్తున్నప్పటికీ చరణ్ స్వాగ్ తో వాటిని పూర్తిగా డామినేట్ చేసేలా ఒరిజినాలిటీ సృష్టించడంలో బుచ్చిబాబు విజయం సాధించాడు. అయితే కేవలం ఈ నిమిషం వీడియోని బట్టి పెద్ద పెద్ద తీర్పులు ఇవ్వలేం కానీ ఫస్ట్ షాట్ పేరుతో తను రాసిన మొదటి పరీక్షలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసయ్యాడు. తర్వాత పెట్టుకోవాల్సిన టార్గెట్ డిస్టింక్షన్, అటుపై స్టేట్ ఫస్ట్, ఆ తర్వాత ఇండియా టాప్ వన్. ఎందుకంటే అంచనాల పరంగా బుచ్చిబాబు మీద బరువు పెరుగుతూ పోతుంది. దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద సవాల్.
రిలీజ్ కి ఇంకా ఏడాది ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు హడావిడిగా చేయాల్సింది ఏం లేదు కానీ ఏఆర్ రెహమాన్ నుంచి బెస్ట్ రాబట్టుకోవడం బుచ్చిబాబు ఎదురుకోబోయే మరో ఛాలెంజ్. టీజర్ వరకు కార్యం సాధించుకున్నాడు. ఇంతే మోతాదులో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వచ్చాయంటే అనిరుద్, దేవి, తమన్ పని చేయలేదనే లోటు తెలియకుండా పోతుంది. టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల్లో రెహమాన్ కు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇప్పటిదాకా లేదు. అది పెద్దితో మారుతుందని మ్యూజిక్ లవర్స్ నమ్మకం. 2026 మార్చి 26 బోలెడు దూరం ఉంది కనక అప్పటిదాకా చాలా కబుర్లు, అప్డేట్లు తెలుస్తాయి. చూడాలి బుచ్చిబాబు ఇంకేం వండుతాడో.
This post was last modified on April 6, 2025 1:50 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…