ఎంత రాజమౌళి ప్యాన్ ఇండియా మూవీ ఆలస్యమవుతుందని తెలిసినా అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు డిస్ట్రిబ్యూటర్లు ఆపడం లేదు. వరుసగా పాత సినిమాల రీ రిలీజులను క్యూ కట్టిస్తూ సొమ్ములు రాబట్టుకునే పనిలో పడ్డారు. ఇటీవలే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు ఎంత మంచి ఆదరణ దక్కిందో చూశాం. పన్నెండేళ్ల తర్వాత థియేటర్లకు వచ్చింది కాబట్టి జనం బాగానే చూశారు. వసూళ్లు భారీగా నమోదయ్యాయి. కానీ ‘ఒక్కడు’ ఇప్పటికే రెండు మూడు సార్లు రీ రిలీజ్ అయ్యింది. మళ్ళీ ఏప్రిల్ 26 ఇంకోసారి చూడమంటూ ప్రకటనలు వదిలారు. ఏకంగా ట్రెండింగ్ లోకి తెచ్చేశారు.
ఈ అనౌన్స్ మెంట్ వచ్చిన గంటల్లోనే ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 19 పునః విడుదల చేయబోతున్నట్టు అప్డేట్ వచ్చేసింది. జూన్ లేదా జూలైలో ‘అతిథి’ని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఆగస్ట్ లో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘అతడు’కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఇలా బ్లాక్ బస్టర్లన్నీ ఒకేసారి పిండేసుకుంటే తర్వాత చూసుకోవడానికి ఏముండవు. అసలే మహేష్ నటించింది కేవలం 28 సినిమాలు. వాటిలో బాబీ, నాని, స్పైడర్, వంశీ లాంటివి ఉపయోగపడవు. ఎంతసేపు యావరేజ్ లేదా సూపర్ హిట్లను వాడుకోవాల్సిందే. ఇప్పుడదే జరుగుతోంది.
నిజానికి ఈ ధోరణికి కాస్తంత బ్రేక్ వేయాలి. వీటి వల్ల కొత్త సినిమాల వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయి. పోనీ పాత చిత్రాలను ఏమైనా తగ్గింపు టికెట్ రేట్లతో ప్రదర్శిస్తున్నారా అంటే అదీ లేదు. రెగ్యులర్ ధరలే ఉంటున్నాయి. వీటిని చూస్తున్న జనాలు పెద్దగా టాక్ రాని లేటెస్ట్ రిలీజులను లైట్ తీసుకుంటున్నారు. అయినా అన్నీ 2025లోనే జరిగిపోవాలనే తరహాలో ఇన్నేసి రీ రిలీజులు మూకుమ్మడిగా రావడం సరైంది కాదు. అయినా ఇవి ఒకరు చెబితే వినేవి కాదు కానీ అభిమానులు తమంత తాముగా ప్రెస్టీజ్ కు వెళ్ళకుండా రికార్డుల కోసం రీ రిలీజులను చూడటం తగ్గిస్తే క్రమంగా ఈ తాకిడి నెమ్మదించి తర్వాత గాడిలో పడుతుంది.
This post was last modified on April 4, 2025 5:42 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…