ఎంత రాజమౌళి ప్యాన్ ఇండియా మూవీ ఆలస్యమవుతుందని తెలిసినా అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు డిస్ట్రిబ్యూటర్లు ఆపడం లేదు. వరుసగా పాత సినిమాల రీ రిలీజులను క్యూ కట్టిస్తూ సొమ్ములు రాబట్టుకునే పనిలో పడ్డారు. ఇటీవలే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు ఎంత మంచి ఆదరణ దక్కిందో చూశాం. పన్నెండేళ్ల తర్వాత థియేటర్లకు వచ్చింది కాబట్టి జనం బాగానే చూశారు. వసూళ్లు భారీగా నమోదయ్యాయి. కానీ ‘ఒక్కడు’ ఇప్పటికే రెండు మూడు సార్లు రీ రిలీజ్ అయ్యింది. మళ్ళీ ఏప్రిల్ 26 ఇంకోసారి చూడమంటూ ప్రకటనలు వదిలారు. ఏకంగా ట్రెండింగ్ లోకి తెచ్చేశారు.
ఈ అనౌన్స్ మెంట్ వచ్చిన గంటల్లోనే ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 19 పునః విడుదల చేయబోతున్నట్టు అప్డేట్ వచ్చేసింది. జూన్ లేదా జూలైలో ‘అతిథి’ని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఆగస్ట్ లో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘అతడు’కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఇలా బ్లాక్ బస్టర్లన్నీ ఒకేసారి పిండేసుకుంటే తర్వాత చూసుకోవడానికి ఏముండవు. అసలే మహేష్ నటించింది కేవలం 28 సినిమాలు. వాటిలో బాబీ, నాని, స్పైడర్, వంశీ లాంటివి ఉపయోగపడవు. ఎంతసేపు యావరేజ్ లేదా సూపర్ హిట్లను వాడుకోవాల్సిందే. ఇప్పుడదే జరుగుతోంది.
నిజానికి ఈ ధోరణికి కాస్తంత బ్రేక్ వేయాలి. వీటి వల్ల కొత్త సినిమాల వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయి. పోనీ పాత చిత్రాలను ఏమైనా తగ్గింపు టికెట్ రేట్లతో ప్రదర్శిస్తున్నారా అంటే అదీ లేదు. రెగ్యులర్ ధరలే ఉంటున్నాయి. వీటిని చూస్తున్న జనాలు పెద్దగా టాక్ రాని లేటెస్ట్ రిలీజులను లైట్ తీసుకుంటున్నారు. అయినా అన్నీ 2025లోనే జరిగిపోవాలనే తరహాలో ఇన్నేసి రీ రిలీజులు మూకుమ్మడిగా రావడం సరైంది కాదు. అయినా ఇవి ఒకరు చెబితే వినేవి కాదు కానీ అభిమానులు తమంత తాముగా ప్రెస్టీజ్ కు వెళ్ళకుండా రికార్డుల కోసం రీ రిలీజులను చూడటం తగ్గిస్తే క్రమంగా ఈ తాకిడి నెమ్మదించి తర్వాత గాడిలో పడుతుంది.
This post was last modified on April 4, 2025 5:42 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…