తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం.. ఆదిత్య 369. ఇప్పుడు చూసినా కొత్తగా అనిపించే కాన్సెప్ట్తో 34 ఏళ్ల కిందటే సినిమా తీసి అబ్బురపరిచింది సింగీతం శ్రీనివాసరావు బృందం. ఈ ఆల్ టైం క్లాసిక్ ఈ శుక్రవారం పెద్ద ఎత్తున రీ రిలీజ్ కాబోతోంది. ఒక కొత్త సినిమా స్థాయిలో దీనికి టీం ప్రమోషన్లు చేస్తోంది. మొన్న నందమూరి బాలకృష్ణ తదితరులు కలిసి ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. తాజాగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సైతం మీడియాను కలిశారు. ‘ఆదిత్య 369’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐతే దీని కంటే ముందే ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ‘ఆదిత్య 369’కు నాసా సైంటిస్టుల ప్రశంసలు దక్కిన విషయాన్ని పంచుకోవడం విశేషం.
ఆదిత్య 369 తీసిన సమయానికి అప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద టైం మెషీన్ నేపథ్యంలో సినిమానే రాలేదని.. అయినా ఇండియాలో ఈ తరహా చిత్రం తొలిసారి తీసినప్పటికీ పర్ఫెక్షన్ ఉండేలా చూసుకున్నామని సింగీతం తెలిపారు. నాసాలో పని చేసే తెలుగు, ఇండియన్ సైంటిస్టులకు ఈ సినిమా గురించి తెలిసి ముచ్చటపడి.. తమ బృందానికి ఈ సినిమా చూపించారని.. వాళ్లందరికీ ఈ సినిమా చాలా నచ్చి తమతో మాట్లాడారని సింగీతం తెలిపారు. అప్పటికే వరల్డ్ సినిమాలో టైం మెషీన్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయని.. ఐతే వాటన్నింటిలో ఇదే పర్ఫెక్ట్గా ఉందని కితాబిచ్చారని సింగీతం చెప్పారు. కాలంలో ప్రయాణానికి కాంతికి సంబంధం ఉందని.. ఈ విషయాన్ని టైం మెషీన్ పని చేయడం మొదలుపెట్టి హీరో హీరోయిన్లు అందులో ప్రయాణం మొదలుపెట్టే సన్నివేశం చూసి నాసా సైంటిస్టులు ఎంతగానో అభినందించారని సింగీతం తెలిపారు.
ఇక తాజా ఇంటర్వ్యూలో సింగీతం మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ తీయాలని ఎంతో ప్రయత్నించామని.. స్క్రిప్టు కూడా రెడీ చేశామని.. కానీ ఇప్పటిదాకా అది సాధ్యపడలేదని అన్నారు. ఈ సీక్వెల్తో తన కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని కూడా బాలయ్య భావించారని.. ఆలస్యం అయినప్పటికీ బాలయ్య ఈ సినిమా చేయాలనే అనుకుంటున్నారని సింగీతం తెలిపారు. ‘ఆదిత్య 369’ తీయాలనుకున్నపుడు తనకు బాలయ్య తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని.. విజయశాంతిని హీరోయిన్గా అనుకున్నప్పటికీ ఆమెకు కుదురకపోవడంతో మోహినిని తీసుకున్నామని.. తాను కాలేజీ రోజుల్లో చదివిని ‘ది టైం మెషీన్’ అనే నవల ఈ సినిమాకు స్ఫూర్తి అని సింగీతం వెల్లడించారు.
This post was last modified on April 3, 2025 2:17 pm
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…