Movie News

‘ఆదిత్య 369’ చూసి నాసా సైంటిస్టులు ఫిదా

తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం.. ఆదిత్య 369. ఇప్పుడు చూసినా కొత్తగా అనిపించే కాన్సెప్ట్‌తో 34 ఏళ్ల కిందటే సినిమా తీసి అబ్బురపరిచింది సింగీతం శ్రీనివాసరావు బృందం. ఈ ఆల్ టైం క్లాసిక్ ఈ శుక్రవారం పెద్ద ఎత్తున రీ రిలీజ్ కాబోతోంది. ఒక కొత్త సినిమా స్థాయిలో దీనికి టీం ప్రమోషన్లు చేస్తోంది. మొన్న నందమూరి బాలకృష్ణ తదితరులు కలిసి ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. తాజాగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సైతం మీడియాను కలిశారు. ‘ఆదిత్య 369’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐతే దీని కంటే ముందే ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ‘ఆదిత్య 369’కు నాసా సైంటిస్టుల ప్రశంసలు దక్కిన విషయాన్ని పంచుకోవడం విశేషం.

ఆదిత్య 369 తీసిన సమయానికి అప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద టైం మెషీన్ నేపథ్యంలో సినిమానే రాలేదని.. అయినా ఇండియాలో ఈ తరహా చిత్రం తొలిసారి తీసినప్పటికీ పర్ఫెక్షన్ ఉండేలా చూసుకున్నామని సింగీతం తెలిపారు. నాసాలో పని చేసే తెలుగు, ఇండియన్ సైంటిస్టులకు ఈ సినిమా గురించి తెలిసి ముచ్చటపడి.. తమ బృందానికి ఈ సినిమా చూపించారని.. వాళ్లందరికీ ఈ సినిమా చాలా నచ్చి తమతో మాట్లాడారని సింగీతం తెలిపారు. అప్పటికే వరల్డ్ సినిమాలో టైం మెషీన్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయని.. ఐతే వాటన్నింటిలో ఇదే పర్ఫెక్ట్‌గా ఉందని కితాబిచ్చారని సింగీతం చెప్పారు. కాలంలో ప్రయాణానికి కాంతికి సంబంధం ఉందని.. ఈ విషయాన్ని టైం మెషీన్ పని చేయడం మొదలుపెట్టి హీరో హీరోయిన్లు అందులో ప్రయాణం మొదలుపెట్టే సన్నివేశం చూసి నాసా సైంటిస్టులు ఎంతగానో అభినందించారని సింగీతం తెలిపారు. 

ఇక తాజా ఇంటర్వ్యూలో సింగీతం మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ తీయాలని ఎంతో ప్రయత్నించామని.. స్క్రిప్టు కూడా రెడీ చేశామని.. కానీ ఇప్పటిదాకా అది సాధ్యపడలేదని అన్నారు. ఈ సీక్వెల్‌తో తన కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని కూడా బాలయ్య భావించారని.. ఆలస్యం అయినప్పటికీ బాలయ్య ఈ సినిమా చేయాలనే అనుకుంటున్నారని సింగీతం తెలిపారు. ‘ఆదిత్య 369’ తీయాలనుకున్నపుడు తనకు బాలయ్య తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని.. విజయశాంతిని హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ ఆమెకు కుదురకపోవడంతో మోహినిని తీసుకున్నామని.. తాను కాలేజీ రోజుల్లో చదివిని ‘ది టైం మెషీన్’ అనే నవల ఈ సినిమాకు స్ఫూర్తి అని సింగీతం వెల్లడించారు.

Kumar

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

3 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

3 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

5 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

5 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

5 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

6 hours ago