తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం.. ఆదిత్య 369. ఇప్పుడు చూసినా కొత్తగా అనిపించే కాన్సెప్ట్తో 34 ఏళ్ల కిందటే సినిమా తీసి అబ్బురపరిచింది సింగీతం శ్రీనివాసరావు బృందం. ఈ ఆల్ టైం క్లాసిక్ ఈ శుక్రవారం పెద్ద ఎత్తున రీ రిలీజ్ కాబోతోంది. ఒక కొత్త సినిమా స్థాయిలో దీనికి టీం ప్రమోషన్లు చేస్తోంది. మొన్న నందమూరి బాలకృష్ణ తదితరులు కలిసి ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. తాజాగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సైతం మీడియాను కలిశారు. ‘ఆదిత్య 369’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐతే దీని కంటే ముందే ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ‘ఆదిత్య 369’కు నాసా సైంటిస్టుల ప్రశంసలు దక్కిన విషయాన్ని పంచుకోవడం విశేషం.
ఆదిత్య 369 తీసిన సమయానికి అప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద టైం మెషీన్ నేపథ్యంలో సినిమానే రాలేదని.. అయినా ఇండియాలో ఈ తరహా చిత్రం తొలిసారి తీసినప్పటికీ పర్ఫెక్షన్ ఉండేలా చూసుకున్నామని సింగీతం తెలిపారు. నాసాలో పని చేసే తెలుగు, ఇండియన్ సైంటిస్టులకు ఈ సినిమా గురించి తెలిసి ముచ్చటపడి.. తమ బృందానికి ఈ సినిమా చూపించారని.. వాళ్లందరికీ ఈ సినిమా చాలా నచ్చి తమతో మాట్లాడారని సింగీతం తెలిపారు. అప్పటికే వరల్డ్ సినిమాలో టైం మెషీన్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయని.. ఐతే వాటన్నింటిలో ఇదే పర్ఫెక్ట్గా ఉందని కితాబిచ్చారని సింగీతం చెప్పారు. కాలంలో ప్రయాణానికి కాంతికి సంబంధం ఉందని.. ఈ విషయాన్ని టైం మెషీన్ పని చేయడం మొదలుపెట్టి హీరో హీరోయిన్లు అందులో ప్రయాణం మొదలుపెట్టే సన్నివేశం చూసి నాసా సైంటిస్టులు ఎంతగానో అభినందించారని సింగీతం తెలిపారు.
ఇక తాజా ఇంటర్వ్యూలో సింగీతం మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ తీయాలని ఎంతో ప్రయత్నించామని.. స్క్రిప్టు కూడా రెడీ చేశామని.. కానీ ఇప్పటిదాకా అది సాధ్యపడలేదని అన్నారు. ఈ సీక్వెల్తో తన కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని కూడా బాలయ్య భావించారని.. ఆలస్యం అయినప్పటికీ బాలయ్య ఈ సినిమా చేయాలనే అనుకుంటున్నారని సింగీతం తెలిపారు. ‘ఆదిత్య 369’ తీయాలనుకున్నపుడు తనకు బాలయ్య తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని.. విజయశాంతిని హీరోయిన్గా అనుకున్నప్పటికీ ఆమెకు కుదురకపోవడంతో మోహినిని తీసుకున్నామని.. తాను కాలేజీ రోజుల్లో చదివిని ‘ది టైం మెషీన్’ అనే నవల ఈ సినిమాకు స్ఫూర్తి అని సింగీతం వెల్లడించారు.
This post was last modified on April 3, 2025 2:17 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…