ఏపీలో విపక్షం వైసీపీకి చెందిన మరో కీలక నేత, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుదామంటూ ఉత్సాహపడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఓ కీలక నేరానికి సంబంధించిన కేసు నమోదు అయిపోయింది. జిల్లాలోని క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగానే కాకుండా ఇష్టారాజ్యంగా దోచేసిన కేసులో ఓ ఆరుగురితో పాటుగా కాకాణి పేరు కూడా చేరిపోయింది. ఈ మేరకు నెల్లూరు పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు ఉండగా… వారిలో కాకాణి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఏ6, ఏ7 నిందితులను సోమవారం అరెస్ట్ చేయగా…గూడూరు కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
వాస్తవానికి ఈ కేసులో ఇదివరకే కాకాణికి చెందిన ముగ్గురు ప్రధాన అనుచరులపై కేసు నమోదు కాగా… ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకున్న ఆ ముగ్గురు క్షణాల్లో హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇదే కేసులో తాజాగా మరో ఏడుగురు నిందితులను చేరుస్తూ సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని పొదలకూరు మండల పరిదిలో రుస్తుం మైన్స్ పేరిట దాదాపుగా రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వేశారన్నది ఈ కేసు ప్రధాన ఆరోపణ. దీనిపై నమోదు అయిన కేసులో నిందితులంతా కాకాణి ప్రధాన అనుచరులే. తాజాగా కాకాణి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారంటేనే… ఆయన పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి..
ఈ కేసు తీవ్రత చూస్తుంటే…కాకాణి అరెస్టు తప్పదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే కాకాణి కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెెచ్చుకోక తప్పదన్న విశ్లేషణలూ లేకపోలేదు. అయితే కాకాణి కోర్టును ఆశ్రయిస్తారా?..కోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట లబిస్తుందా? అన్న దానిపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే…ఇదివరకే నమోదు అయిన ఈ కేసులో ఇప్పుడు కాకాణి పేరును చేర్చారంటేనే ఈ కేసులో ఆయన పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు దొరికి ఉంటేనే… పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకుని ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసు నుంచి కాకాణి ఎలా తప్పించుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…