ఏపీలో విపక్షం వైసీపీకి చెందిన మరో కీలక నేత, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుదామంటూ ఉత్సాహపడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఓ కీలక నేరానికి సంబంధించిన కేసు నమోదు అయిపోయింది. జిల్లాలోని క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగానే కాకుండా ఇష్టారాజ్యంగా దోచేసిన కేసులో ఓ ఆరుగురితో పాటుగా కాకాణి పేరు కూడా చేరిపోయింది. ఈ మేరకు నెల్లూరు పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు ఉండగా… వారిలో కాకాణి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఏ6, ఏ7 నిందితులను సోమవారం అరెస్ట్ చేయగా…గూడూరు కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
వాస్తవానికి ఈ కేసులో ఇదివరకే కాకాణికి చెందిన ముగ్గురు ప్రధాన అనుచరులపై కేసు నమోదు కాగా… ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకున్న ఆ ముగ్గురు క్షణాల్లో హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇదే కేసులో తాజాగా మరో ఏడుగురు నిందితులను చేరుస్తూ సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని పొదలకూరు మండల పరిదిలో రుస్తుం మైన్స్ పేరిట దాదాపుగా రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వేశారన్నది ఈ కేసు ప్రధాన ఆరోపణ. దీనిపై నమోదు అయిన కేసులో నిందితులంతా కాకాణి ప్రధాన అనుచరులే. తాజాగా కాకాణి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారంటేనే… ఆయన పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి..
ఈ కేసు తీవ్రత చూస్తుంటే…కాకాణి అరెస్టు తప్పదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే కాకాణి కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెెచ్చుకోక తప్పదన్న విశ్లేషణలూ లేకపోలేదు. అయితే కాకాణి కోర్టును ఆశ్రయిస్తారా?..కోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట లబిస్తుందా? అన్న దానిపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే…ఇదివరకే నమోదు అయిన ఈ కేసులో ఇప్పుడు కాకాణి పేరును చేర్చారంటేనే ఈ కేసులో ఆయన పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు దొరికి ఉంటేనే… పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకుని ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసు నుంచి కాకాణి ఎలా తప్పించుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
This post was last modified on March 25, 2025 10:40 am
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…