Movie News

నాకు కూడా కార్ EMI ఉంది: సలార్ విలన్

ప్రస్తుతం ఇండియాలో మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకడు. పేరుకు మలయాళ నటుడే కానీ.. అతను బహు భాషల్లో నటిస్తున్నాడు. ఓవైపు మలయాళంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు ఇతర భాషల్లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ‘సలార్’ లాంటి మెగా మూవీలో కీలక పాత్ర చేసిన అతను.. మహేష్ బాబు-రాజమౌళి చిత్రంలోనూ కీ రోల్ పట్టేసిన సంగతి తెలిసిందే. నటుడిగా ఇంత బిజీగా ఉంటూ కూడా పృథ్వీరాజ్ దర్శకత్వమూ చేస్తుండడం విశేషం. ఇప్పటికే లూసిఫర్, బ్రో డాడీ రూపంలో రెండు హిట్లు ఇచ్చాడు. ఇప్పుడు తన నుంచి రాబోతున్న ‘లూసిఫర్’ సీక్వెల్ ‘ఎల్-2: ఎంపురాన్’కు క్రేజ్ మామూలుగా లేదు.

ఈ స్థాయిలో ఉన్న పృథ్వీరాజ్‌.. తనకూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కారు ఈఎంఐ కడుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. అందరిలాగే నటీనటులకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని.. తనకూ కారు ఈఎంఐ ఉందని పృథ్వీరాజ్ వెల్లడించాడు. దర్శకత్వం అన్నది తాను ఆర్థిక పరంగా తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయమని అతను వ్యాఖ్యానించడం విశేషం. ‘ఎల్-2: ఎంపురాన్’ కోసం తాను రెండేళ్లు కేటాయించానని.. ఆ సమయంలో నటుడిగా ఎన్నో సినిమాలను పక్కన పెట్టాల్సి వచ్చిందని.. ఆ సినిమాల్లో నటించి ఉంటే తనకు చాలా డబ్బు వచ్చేదని చెప్పాడు. తాను డబ్బు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదని.. కానీ కమర్షియల్స్ మాత్రం చేశానని పృథ్వీరాజ్ చెప్పాడు.

యాడ్స్ కోసం రెండు గంటలు షూటింగ్‌లో పాల్గొన్నా చాలా డబ్బు ఇచ్చేవారని.. కానీ తాను ప్రమోట్ చేసే ఉత్పత్తుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటానని పృథ్వీరాజ్ స్పష్టం చేశాడు. తన తండ్రి సుకుమారన్ దర్శకత్వం చేయాలని ఎంతో ఆశపడ్డారని.. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయారని చెప్పిన పృథ్వీరాజ్.. తన సక్సెస్ చూసేందుకు పక్కన లేకపోవడం ఎంతో బాధ కలిగించే విషయమని అన్నాడు. దర్శకుడిగా రజినీకాంత్‌తో సినిమా చేయలన్నది తన కల అని.. అందుకోసం ఒక ఐడియా కూడా ఉందని.. కథ సిద్ధం చేయాల్సి ఉందని పృథ్వీరాజ్ తెలిపాడు.

This post was last modified on March 24, 2025 1:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

48 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago